ప్రయివేట బస్సు దగ్ధం: తప్పిన పెనుప్రమాదం
విజయనగరం జిల్లాలోని ఎస్.కోట మండలం కిలకంపాలెం వద్ద బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
విజయనగరం : విజయనగరం జిల్లాలోని ఎస్.కోట మండలం కిలకంపాలెం వద్ద బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులను ముందే దించి వేయడంతో ఎటువంటి ప్రాణనష్టం కలగలేదు. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నారు.

బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం నుంచి అరకు పర్యాటక ప్రదేశాలలకు వెళ్తున్న విజయలక్ష్మి ట్రావెల్స్ బస్సుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications