జగన్ పార్టీకి షాక్: 12మంది ఎమ్మెల్యేలకు నోటీసులు
హైదరాబాద్: గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా విషయంలో నిరసన తెలుపుతూ అసెంబ్లీ కార్యదర్శి టేబుల్ పైకి ఎక్కిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ తీవ్రంగా స్పందించింది. అసెంబ్లీ ఈ విధంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా పరిగణించిన కమిటీ.. 12మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.
అక్టోబర్ 25,26 తేదీల్లో ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. రోజుకు ఆరుగురు సభ్యుల చొప్పున హాజరవ్వవాలని ఆదేశించారు. కాగా, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ వైసీపీ సభ్యులు సభను స్తంభింపజేసిన విషయం తెలిసిందే. అంతేగాక, సభలో నిరసనలు కూడా చేపట్టారు.
కాగా, ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేయడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడితే నోటీసులు జారీ ఇస్తారా? అంటూ నిలదీస్తున్నారు. కాగా, ప్రివిలేజ్ కమిటీలో వైసీపీ నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే సభ్యుడిగా ఉన్నారు.

నోటీసులు జారీ అందుకున్న ఎమ్మెల్యేలు వీరే
కంబాల జోగులు, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్ కుమార్, ముత్యాలనాయుడు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాడిశెట్టి రాజయ్య, కొరుముట్ల శ్రీనివాసులు, చెర్ల జగ్గిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలకు నోటీసులు జారీ అయ్యాయి.
హోదా కోసమే అడ్డుకున్నాం, దేనికైనా సిద్ధం: విశ్వేశ్వర్ రెడ్డి
అసెంబ్లీలో సమావేశాలను ఏపీకీ ప్రత్యేక హోదా కోసమే అడ్డుకున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. సభా హక్కులకు భంగం కలిగించారని తమ పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారని, వాళ్లు ఏం నేరం చేశారని ఆయన ప్రశ్నించారు.
ప్రజల ఘోష, వారి భవిష్యత్ ప్రభుత్వానికి పట్టవని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోని ప్రభుత్వం.. తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు హడావుడి చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షం మొత్తాన్ని సస్పెండ్ చేసినా హోదాపై పోరాటం ఆపబోమని విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications