అంతా వాళ్లు చెప్పినట్లే చేశా..! ఏసీబీ విచారణలో చేతులెత్తేసిన మరో జగన్ అధికారి..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న దాదాపు రూ.2500 కోట్ల ఇసుక అక్రమాల విషయంలో ఏసీబీ విచారణలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. అప్పట్లో గనుల శాఖ ఇసుక టెండర్లు, లీజులు, ఇతర అనుమతులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల్లో గత ప్రభుత్వ పెద్దల పాత్రను నిర్ధారించేలా కీలక ఆధారాలు లభిస్తున్నాయి. ఈ మేరకు అప్పట్లో గనుల శాఖ డీజీగా పనిచేసిన వీజీ వెంకటరెడ్డిపై జరుగుతున్న విచారణలో సంచలన అంశాలు వెల్లడవుతున్నాయి.
గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తాను కేవలం అమలు మాత్రమే చేశానని, అంతకు మించి తన పాత్రమే లేదని వెంకటరెడ్డి ఏసీబీ విచారణలో వెల్లడించారు. అప్పటి ప్రభుత్వ పెద్దల్ని ధిక్కరించే పరిస్ధితి లేకపోవడంతో వారి ఆదేశాలు అమలు చేసినట్లు తెలిపారు. అఖిల భారత సర్వీసు అధికారిగా నిబంధనలకు విరుద్ధంగా ఎవరి ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేకపోయినా అప్పట్లో మరో ప్రత్యామ్నాయం లేదని వెంకటరెడ్డి విచారణలో ఏసీబీకి చెప్పినట్లు తెలుస్తోంది.

తాజాగా ఇసుక తవ్వకాల కేసులో ఏసీబీ అరెస్టు చేసిన వెంకటరెడ్డిని కోర్టు తొలుత రిమాండ్ కు, ఆ తర్వాత కస్టడీకి ఇచ్చింది. దీంతో అప్పట్లో ఇసుక తవ్వకాలను ప్రైవేటుకు అప్పగించడం, వారికి లబ్ది చేకూరేలా తీసుకున్న పలు నిర్ణయాలపై వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే వేటికీ ఆయన తన సొంత నిర్ణయాలు తీసుకున్నట్లు ఒప్పుకోలేదని తెలుస్తోంది. కేవలం అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు మాత్రమే విన్నట్లు ఆయన చెప్తున్నారు. అయితే ఆ పెద్దలు ఎవరో కూడా ఆయన వెల్లడించలేదు. మీకు అన్నీ తెలుసు, ఇంతకు మించి నేనేమీ చెప్పలేను అని వెంకటరెడ్డి తేల్చిచెప్పేసినట్లు తెలుస్తోంది.
దీంతో ఏసీబీ అధికారులు ఆయన నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications