పూర్వోదయం పథకంలో రూ.1300 కోట్లతో ప్రాజెక్ట్ లు.. ఆ జిల్లాకు మహర్దశ!
రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లాకు శుభవార్త చెప్పారు. పూర్వోదయ పథకం ద్వారా విజయనగరం జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ పథకం కింద సుమారు రూ.1300 కోట్లతో నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రణాళికను తయారు చేసినట్లు వెల్లడించి ఆయన తీపి కబురు చెప్పారు.
విజయనగరం జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్ లపై సమీక్ష చేసిన మంత్రి
విజయనగరం జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు, సాగునీటి వనరులపై కలెక్టరేట్లో నేడు ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని మంత్రి అధ్యక్షతన నిర్వహించారు. తోటపల్లి, తారకరామ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గజపతినగరం బ్రాంచ్ కెనాల్, గడిగెడ్డ, పెద్దగెడ్డ తదితర ప్రాజెక్టుల అభివృద్ధి, మరమ్మతులు, కాలువల్లో పూడిక తీత, భూ సేకరణ, పునరావాసం తదితర అంశాలపై ప్రజా ప్రతినిధులతో కలిసి చర్చించారు.

త్వరలో భూసేకరణ పూర్తి చేస్తామన్న కలెక్టర్
ఆయా ప్రాజెక్టుల ఇంజనీర్లతో మాట్లాడి పురోగతిని తెలుసుకున్నారు. పూర్తి చేయడానికి కావాల్సిన వనరుల సమీకరణ, పనులపై చర్చించారు. ప్రాజెక్టుల పరిస్థితులను, తీసుకోవాల్సిన చర్యలను జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి వివరించారు. త్వరలో భూసేకరణ పూర్తి చేస్తామని చెప్పారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు, ఎమ్మెల్యేలు కిమిడి కళా వెంకట్రావు, కోళ్ల లలిత కుమారి, పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు తమ సూచనలను చేశారు.
పూర్వోదయ పథకం ద్వారా రూ.1300 కోట్లతో పనులు
రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, డిసిఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ మాట్లాడుతూ, సాగునీటి వనరులకు సంబంధించిన వివిధ అంశాలను, సమస్యలను ప్రస్తావించారు.అనంతరం మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ పూర్వోదయ పథకం ద్వారా రూ.1300 కోట్లతో తోటపల్లి, తారకరామా ప్రాజెక్టుల పెండింగ్ పనులు, గజపతినగరం బ్రాంచ్ కెనాల్, గడిగెడ్డ - చంపావతి అనుసంధాన పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
సుమారు రూ.2,000 కోట్లను ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ ల కోసం ఇచ్చిన సర్కార్
ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం సుమారు రూ.2,000 కోట్లను కేటాయించిందని తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా జిల్లాలో సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, ప్రస్తుతం 58వేల ఎకరాలకు నీరు అందుతుందని అన్నారు. మిగిలిన భూములకు సాగునీరు అందించేందుకు పనులను పూర్తి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని, ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications