చిరంజీవి అలా చేశాక ఏం చేయాలో అర్థం కాలేదు: టిడిపిలో చేరిన శోభారాణి, నాడు ఇలా..
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన శోభారాణి తెలుగుదేశం పార్టీలో చేరారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో మహిళా విబాగమైన మహిళా రాజ్యం రాష్ట్ర అధ్యక్షురాలిగా శోభారాణి
Recommended Video

అమరావతి: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన శోభారాణి తెలుగుదేశం పార్టీలో చేరారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో మహిళా విబాగమైన మహిళా రాజ్యం రాష్ట్ర అధ్యక్షురాలిగా శోభారాణి వ్యవహరించారు.

సొంతగూటికి శోభారాణి
ఇప్పుడు ఆ శోభారాణి తిరిగి సొంతగూడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి నక్కా ఆనందబాబు సమక్షంలో ఆమె పచ్చ కండువా కప్పుకున్నారు. ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు టిడిపి నుంచి ఆ పార్టీలోకి చేరిన శోభారాణి, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేసిన తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

అందుకే టిడిపిలోకి
తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతరం శోభారాణి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి పనులు తనను ఆకర్షించాయని చెప్పారు. అందువల్లే తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు.

చిరంజీవి అలా చేశాక ఏం చేయాలో అర్థం కాలేదు
టిడిపిలో చేరడం సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని శోభారాణి అన్నారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేశాక ఏమి చేయాలో అర్థంకాక కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లోటు బడ్జెట్లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న తీరు నచ్చి పార్టీలో చేరానని తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.

కలిసి పని చేయాలని మంత్రి
మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. శోభారాణి ప్రజారాజ్యంలో చేరక ముందు టిడిపిలోనే కార్యకర్తగా, నాయకురాలిగా సేవలందించారని గుర్తు చేశారు. మహిళా నాయకురాళ్ళు అందరితో కలసికట్టుగా పని చేస్తూ జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజారాజ్యం పార్టీకి లౌడ్ మౌత్ లీడర్గా..
కాగా, చిరంజీవి ప్రజారాజ్యంలో శోభారాణి పార్టీకి లౌడ్ మౌత్ లీడర్గా ఉన్నారు. అప్పుడు ఆమె పేరు ప్రముఖంగా వినిపించేది. చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేసిన కొన్నాళ్లకు ఆమె రాజకీయాలకు దూరంగా ఉండటంతో ఆమె పేరు వినిపించలేదు.

నాడు రోజాతో ఢీ
ప్రస్తుత వైసిపి ఎమ్మెల్యే రోజా గతంలో టిడిపిలో ఉన్నారు. అప్పుడు శోభారాణి ప్రజారాజ్యం పార్టీ తరఫున, రోజా టిడిపి తరఫున మాటల యుద్ధం జరిపేవారు. ఇప్పుడు అదే శోభారాణి టిడిపిలో చేరారు. రోజా ప్రస్తుతం జగన్ పార్టీలో ఉన్నారు.

చిరంజీవిపై నిప్పులు
2009లో చిరంజీవి ఆమెకు పార్టీ టిక్కెట్ నిరాకరించారు. దీంతో ఆమె పీఆర్పీ నుంచి బయటకు వచ్చి.. చిరంజీవిపై మాటల దాడి చేశారు. పీఆర్పీ ఫ్లాఫ్ షో అని నిప్పులు చెరిగారు. చిరంజీవి పార్టీని సరైన దిశలో నడిపి, ప్రజల కోసం పోరాడాలని చురకలు అంటించేవారు.

చిరంజీవి పార్టీని అమ్మేశారని..
అంతేకాదు, కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి పార్టీని అమ్మేశాడని శోభారాణి ఆరోపించారు. మెగా కుటుంబ సభ్యుల చిత్రాలు బ్యాన్ చేయాలని కూడా ప్రజలకు పిలుపునిచ్చారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications