సీమకు ఇప్పటి వరకు ఒకటే పరిశ్రమ, ఏపీ నుంచి ఒక్కటీ రాలేదు: పురంధేశ్వరి
వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామికీకరణ అవసరం ఎంతో ఉందని బిజెపి జాతీయ మహిళా మోర్చా ఇంచార్జి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఆదివారం అన్నారు.
అమరావతి: వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామికీకరణ అవసరం ఎంతో ఉందని బిజెపి జాతీయ మహిళా మోర్చా ఇంచార్జి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఆదివారం అన్నారు.
కోడుమూరులో ఆదివారం బిజెపి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు. రాయలసీమలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర కరవు ఏర్పడిందన్నారు.
రాయలసీమకు ఇప్పటి వరకు కేవలం ఒక్క పరిశ్రమ మాత్రమే వచ్చిందని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. వెనుకబడిన రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు కలిపి కేంద్రం ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున మూడేళ్లకు రూ. 1,050 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు.

ప్రజా ప్రయోజనాల నిమిత్తం కేంద్రం కృషి సించాయి యోజన ఏర్పాటు చేసిందని తెలిపారు. అందులో ఏపీ నుంచి అభివృద్ధికి సంబంధించి 8 అంశాలు రాగా అందులో రాయలసీమకు సంబంధించి ఒక్కటి కూడా లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనధార అయిన పోలవరానికి జాతీయ హోదా కల్పించిన బిజెపి ప్రభుత్వం, దాని నిర్మాణం కోసం ఖర్చు అంతా ఇస్తుందన్నారు.
2018 కల్లా రాష్ట్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. ఆ తర్వాత తాగునీటి కష్టాలపై స్థానిక ప్రజలు ఆమెకు విన్నవించుకున్నారు. మహిళలు పట్టువస్త్రాలతో సత్కరించారు.












Click it and Unblock the Notifications