నేను ఎన్టీఆర్ కూతురిని, ఆదరించారు: పురంధేశ్వరి
రాజంపేట: కడప జిల్లా రాజంపేట లోకసభ స్థానంలో చేస్తున్న ప్రచారం బిజెపి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్టీ రామారావు కార్డు వాడుతున్నారు. చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తానని ఆమె అన్నారు. ఆదివారంనాడు ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
నందమూరి తారకరామారావు కూతురుగా రాయలసీమ ప్రజలు తనకొక ప్రత్యేక గుర్తింపు ఇచ్చారని అన్నారు. రాజంపేట నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పురందేశ్వరి వెల్లడించారు. ఇక్కడి యువత అవకాశాలు లేక వలసలు పోతున్నారని, గల్ఫ్ దేశాలకు వెళ్లేవాళ్లు ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారని, ఇవన్నీ తమ దృష్టికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యలను ఏక కాలంలో పరిష్కరించగలమని వాగ్ధానం చేయడంలేదని, అయితే ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి సంపూర్ణమైన కృషి చేస్తామని పురందేశ్వరి చెప్పారు.
రాజంపేట లోకసభకు ఈ నెల 7వ తేదీన పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి తన ప్రచారంలో వేగాన్ని పెంచారు. విజయం కోసం ఆమె తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
-
తమిళనాడు, బెంగాల్ ఎన్నికల వేళ.. కీలక పరిణామం- బీజేపీకి బూస్ట్ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications