చెప్పులూ చీపుళ్లతో కొడ్తారు: టిడిపిలో చేరిక వార్తలపై వైసిపి ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ట్విస్ట్
విజయనగరం: తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను విజయనగరం జిల్లా కురుపాం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు పుష్ప శ్రీవాణి ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె సోమవారంనాడు అన్నారు.
రాజకీయాలు అంటే తెలియని రోజుల నుంచి తనకు వైయస్ రాజశేఖర రెడ్డి అంటే విపరీతమైన అభిమానమని, ఆ అభిమానంతోనే నియోజకవర్గం ప్రజలు తనను 20 వేల మెజారిటీతో గెలిపించారని ఆమె అన్నారు. అయినా తెలుగుదేశం పార్టీలో ఏముందని చేరడానికని ఆమె వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రజల్లోకి వెళ్లలేని స్థితిలో ఉన్నారని, ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యురాలిగా తాను ధైర్యంగా వెళ్ల గలుతున్నానని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుని గెలిచినవాళ్లమని, అలాంటిది తాను పార్టీ మారి టిడిపిలోకి వెళ్తే నియోజకవర్గం ప్రజలు చెప్పులూ చీపుళ్లతో తరిమికొడుతారని ఆమె అన్నారు.
వైయస్ జగన్ నాయకత్వంపై పూర్తి నమ్మకం ఉందని ఆమె అన్నారు. తెలంగాణలో అధికార అధికార టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి, బేరసారాలు ఆడుతోందని వ్యాఖ్యానించిన టిడిపి ఇప్పుడు తాను చేస్తున్నదేమిటని ఆమె ప్రశ్నించారు. టిడిపి మైండ్ గేమ్ ఆడుతోందని అన్నారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications