బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు
వేసవి ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రెండు ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రకటించారు. ఏపీ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. తొలి రైలు ఆదివారం పట్టాలెక్కనుంది. ఈ నెల 29వ వ తేదీ వరకు అవి అందుబాటులో ఉంటాయి. బెంగళూరు, మైసూరు నుండి వివిధ గమ్యస్థానాల మధ్య నడిచే ఈ రైళ్ల రాకపోకలు తేదీలు, సమయాల వివరాలను అధికారులు విడుదల చేశారు.
బెంగళూరు- బలుర్ఘాట్
ఈ నెల 12, 19, 26 తేదీల్లో (ఆదివారాలు) ఉదయం 8:50 నిమిషాలకు ఎస్ఎంవీటీ బెంగళూరు నుండి బయలుదేరే నంబర్ 06561 ప్రత్యేక ఎక్స్ ప్రెస్ మూడో రోజు తెల్లవారు జామున 6 గంటలకు బలుర్ఘాట్ కు చేరుకుంటుంది.

ఈ నెల 15, 22, 29 తేదీల్లో (బుధవారాలు) తెల్లవారు జామున 5:15 నిమిషాలకు బలుర్ఘాట్ నుంచి బయలుదేరే నంబర్ 06562 ప్రత్యేక ఎక్స్ ప్రెస్ మూడో వేకువ జామున 3 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరుకు చేరుకుంటుంది.
ఈ రైలులో 2 ఏసీ త్రీ టైర్ కోచ్లు, 5 స్లీపర్ క్లాస్ కోచ్లు, 13 జనరల్ సెకండ్ క్లాస్/సిట్టింగ్ చైర్ కార్ కోచ్లు, 2 దివ్యాంగుల సెకండ్ క్లాస్ కోచ్లను ఏర్పాటు చేశారు.
బెంగళూరు కంటోన్మెంట్ (09:03/09:05), కేఆర్ పురం (10:09/10:11), బంగారుపేట (11:08/11:10), కుప్పం (11:38/11:40), జోలార్పేట (12:40/12:45), కాట్పాడి (14:50/15:00), రేణిగుంట (17:40/17:42), నెల్లూరు (19:10/19:12), ఒంగోలు (21:10/21:20), విజయవాడ (23:53/23:55), రాజమండ్రి, సామర్లకోట (01:35/01:37), సింహాచలం నార్త్ (04:55/05:00), కొత్తవలస (05:38/05:40), విజయనగరం (06:15/06:25)లల్లో ఆగుతుంది.
శ్రీకాకుళం రోడ్ (07:33/07:35), పలాస (09:03/09:05), బరంపురం (09:58/10:00), బలుగావ్ (11:05/11:07), ఖుర్దా రోడ్ (11:35/11:45), భువనేశ్వర్ (12:10/12:15), కటక్ (12:50/12:55), జాజ్పూర్ కే రోడ్ (13:38/13:39), భద్రక్ (15:03/15:05), బాలాసోర్ (15:58/16:00), ఖరగ్పూర్ (17:40/17:50), అండూల్ (19:08/19:10), దంకుని (21:05/21:10), బర్ధమాన్ (22:00/22:03), బోల్పూర్ (22:44/22:45), మాల్దా టౌన్ (మంగళవారం 02:50/03:00), బునియాద్పూర్ (04:15/04:17) మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
మైసూరు- న్యూ జల్పాయ్ గురి
ఈ నెల 17, 24 తేదీల్లో (శుక్రవారాలు) మైసూర్ నుంచి సాయంత్రం 4:40 నిమిషాలకు బయలుదేరే నంబర్ 06251 ప్రత్యేక రైలు మూడో రోజు సాయంత్రం 7:30 గంటలకు న్యూ జల్పాయ్ గురికి చేరుకుంటుంది.
ఈ నెల 20, 27 తేదీల్లో (సోమవారాలు) న్యూ జల్ పాయ్ గురి నుంచి సాయత్రం 4:45 నిమిషాలకు బయలుదేరే నంబర్ 06562 ప్రత్యేక రైలు మూడో రోజు సాయంత్రం 4 గంటలకు మైసూరుకు చేరుకుంటుంది.
ఈ రైలులో 1 ఏసీ ఫస్ట్ క్లాస్ కమ్ ఏసీ టూ టైర్, 2 ఏసీ త్రీ టైర్, 10 స్లీపర్ క్లాస్, 5 జనరల్ సెకండ్ క్లాస్, అలాగే 2 దివ్యాంగుల సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి.
ఈ రైళ్లు మండ్య, మద్దూరు, కెంగేరి, కేఎస్ఆర్ బెంగళూరు, బంగారుపేట, జోలార్పేట, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సింహాచలం నార్త్, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపురం, బలుగావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్పూర్ కే రోడ్, భద్రక్, బాలాసోర్, ఖరగ్పూర్, అండూల్, దంకుని, బర్ధమాన్, బోల్పూర్, రామ్ పూర్ హట్, న్యూ ఫరక్కా, మాల్దా టౌన్, కిషన్ గంజ్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
-
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!!












Click it and Unblock the Notifications