జగన్ను నమ్ముకొని కాదు: రాయపాటి, బిజెపికి కితాబు

ఆయన కృష్ణా జిల్లా విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తాము ఎట్టి పరిస్థితుల్లో విభజనను అడ్డుకొని తీరుతామని చెప్పారు. పార్టీ అధిష్టానం విభజన పైన ముందుకే వెళ్తే కనుక తాము ఏం చేయాలనే అంశంపై చర్చిస్తున్నట్లు చెప్పారు. కొత్త పార్టీ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాక ఆ బిజెపికి సానుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. బిజెపి సీమాంధ్రలో అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశముందన్నారు. బిజెపి విభజనపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోదని భావిస్తున్నామని, తెలంగాణ బిల్లుపై తీర్మానం అడ్డుకుంటామన్నారు.
సమస్యలు పరిష్కరించకుండా ముందుకు సాగదు: డొక్కా
సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించకుండా విభజనపై ముందుకు సాగడం ఏమాత్రం సరికాదని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వేరుగా అన్నారు. ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. అనంతరం మాట్లాడుతూ సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించాకే విభజనపై ముందుకు వెళ్లాలన్నారు.
లగడపాటి ఇంటి ముట్టడి
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇంటిని వైయస్సార కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications