రియల్మీ కొత్త ఫోన్.. ₹9వేలకే ఫాస్ట్ ఛార్జింగ్తో
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రియల్మీ (Realme) కొత్త ఫోన్ను విడుదల చేసింది. ఇది బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం, 50 కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో నార్జో N53 ఫోన్ను విడుదల చేసింది. నార్జో ఎన్ సిరీస్లో ఈ కంపెనీ తీసుకొచ్చిన రెండో ఫోన్ ఇది. తక్కువ ధరలో 4జీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నవారిని ఇది ఆకట్టుకుంటోంది.
నార్జో ఎన్53 ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ+ 64జీబీ వేరియంట్ ధర రూ.8,999 నుంచి ప్రారంభమవుతోంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.10,999గా నిర్ణయించారు. మే 24వ తేదీ మధ్యాహ్నం 12.00 గంటల నుంచి దీని విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయి. HDFC బ్యాంక్ కార్డు హోల్డర్లు ₹1000 వరకు రాయితీ పొందొచ్చు. మొదటి విడత అమ్మకాల్లో 4జీబీ వేరియంట్ను రూ.500, 6జీబీ వేరియంట్ను రూ.1000 రాయితీపై అందిస్తున్నారు. మే 22వ తేదీ మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 4.00 గంటల మధ్య ₹1000వరకు డిస్కౌంట్తో స్పెషల్ సేల్ నిర్వహిస్తున్నారు.

ఈ ఫోన్ లో ఉన్న ఫీచర్ల విషయానికొస్తే 6.74 అంగుళాల డిస్ప్లే అమర్చారు. 90Hz రిఫ్రెష్ రేటుతో ఉంది. అక్టాకోర్ యునిసోక్ T612 ప్రాసెసర్ను అమర్చారు. ఆండ్రాయిడ్ 13తో రియల్మీ యూఐ 4.0తో వస్తోంది. వెనుకవైపు 50 బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఇందులో అమర్చిన 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. కేవలం అరగంట వ్యవధితో 0-50 శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ప్రింట్ సెన్సర్ ఉండి బ్లాక్, గోల్డ్ కలర్స్లో ఈ ఫోన్ లభిస్తుంది
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications