ఎర్రచందనం స్మగ్లర్లు అడవిలోకి ఎంట్రీ ఇలా:భక్తుల్లా తిరుమల కొండ పైకి...అటు నుంచి అటే!
తిరుపతి:ఒకవైపు ఎర్రచందనం స్మగ్లింగ్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా మరోవైపు రెడ్ శాండర్స్ అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో అసలు రెడ్ శాండర్స్ స్మగ్లర్లు ఎటువైపు నుంచి అడవిలో ప్రవేశిస్తున్నారనేది కనుగొనడం పోలీసులకు కష్టసాధ్యంగా మారుతోంది. ఎర్రచందనం స్మగ్లర్లు అడవిలోకి వెళ్లే అవకాశం ఉన్న మార్గాలన్నింటినీ పోలీసు పహారా పరిధిలోకి తెచ్చినప్పటికీ వారు అడవిలోకి ప్రవేశించకుండా అడ్డుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో తిరుమల భక్తుల్లాగా నటిస్తూ ఎర్రచందనం స్మగ్లర్లు పెద్ద సంఖ్యలో అడవిలోకి ప్రవేశిస్తున్నారనడానికి పోలీసులకి స్పష్టమైన ఆధారం లభించింది. వివరాల్లోకి వెళితే...

ఆదివారం ఎర్రచందనం స్మగ్లర్లకోసం అడవిలో కూంబింగ్ జరుపుతున్నటాస్క్ఫోర్స్ పోలీసులు అనూహ్యంగా ఒక స్మగ్లర్ల ముఠాని గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించే క్రమంలో ఒకరు మినహా మిగిలిన స్మగ్లర్లు అందరూ పారిపోయారు. ఆ పట్టుబడిన స్మగ్లర్ ను విచారించిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిసాయి.
దాడుల గురించి ఆర్ఎస్ఐ విజయ నరసింహులు చెప్పిన వివరాల ప్రకారం...ఐజీ కాంతారావు ఆదేశాల మేరకు రోజువారీ తనిఖీల్లో భాగంగా శనివారం రాత్రి కరకంబాడి నుంచి కూంబింగ్ సిబ్బంది తనిఖీలు ప్రారంభించారు.
ఆదివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో అడవిలోకి వెళుతున్న స్మగ్లర్లను టాస్కఫోర్స్ సిబ్బంది గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పలువురు పారిపోగా, తమిళనాడులోని తిరువణ్నామలై జిల్లా కావండనూర్కు చెందిన ఏలుమలై దొరికిపోయాడు. అతడి నుంచి వివిధ వేషధారణల్లో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ల ఫొటోలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో తాము ఎర్రచందనం దుంగలు నరికేందుకు అడవిలోకి ఎలా ప్రవేశిస్తున్నామో తమిళనాడు చెందిన ఆ వ్యక్తి పోలీసులకు వివరించాడు.
స్మగ్లర్లు ఇచ్చే అత్యధిక కూలీ కోసం తమిళనాడుకు చెందిన పేద కూలీలు పలువురు శ్రీవారి భక్తుల రూపంలో బస్సుల్లో ముందుగా అలిపిరి చేరుకుంటామని... అక్కడ నుంచి కాలినడకన తిరుమల ప్రయాణమవుతామని తెలిపాడు. అలా ఎక్కువమంది వస్తే చూసేవాళ్లకి అనుమానం వస్తుందని ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున తనిఖీలు దాటుకుంటూ తిరుమల కొండపైకి గాలిగోపురం వరకు వెళతామని...ఇక ఆ ఆ తరువాత అటునుంచి అటే అడవిలోకి ప్రవేశిస్తామని అతడు వివరించాడు.
తాము మొత్తం 14 మంది బయలుదేరి ఇలా వచ్చామని...ఆల్రెడీ ఎర్రచందనం దుంగల లోడింగ్ చేసేశామని ఈ వ్యక్తి టాస్క్ ఫోర్స్ పోలీసులకు తెలిపాడు. తాము అడవిలో దాచిన దుంగలను చూపిస్తానని సుమారు మూడు గంటలు పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అడవిలో తిప్పిన ఇతడు కేవలం తమను తప్పుదోవ పట్టించేందుకే అలా చేశాడని పోలీసులు గుర్తించారు. నిందితుడిని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications