విజయసాయిరెడ్డి బిగ్ యూ టర్న్..! రీఎంట్రీకి సై- జగన్ కు కండిషన్స్..!
ఏపీలో గతేడాది వైసీపీ పరాజయం తర్వాత ఆ పార్టీకి, ఎంపీ పదవికీ, రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన ఒకప్పటి కీలక నేత విజయసాయిరెడ్డి (vijayasai reddy) పెద్ద షాక్ ఇచ్చారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పడంపై యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు తిరిగి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్ లో మద్యం కుంభకోణంలో ఈడీ విచారణకు హాజరై తిరిగి వెళ్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల నుంచి తాను తప్పుకోనని విజయసాయిరెడ్డి ప్రకటించారు. తన భవిష్యత్ ప్రణాళికలను త్వరలో ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ నెల 25తో తనకు రాజకీయాల్లో ఏడాది ముగుస్తుందని, తిరిగి రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. జగన్ కూడా తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 25 ఏళ్లు ఉంటానని అనుకున్నారని, ఇప్పుడు చంద్రబాబు-లోకేష్ కూడా 30 ఏళ్లు ఉంటామని అనుకుంటున్నారని, కానీ అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. కూటమి అలాగే కొనసాగితే జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. అయితే కోటరీ వ్యవస్థ ఇలాగే కొనసాగితే జగన్ (ys jagan) మళ్లీ అధికారంలోకి రారని తేల్చిచెప్పేశారు. కూటమిని విడగొడితేనే జగన్కు మళ్లీ అధికారం అన్నారు. తాను జగన్ను విమర్శించలేదని, ఆయనే నన్ను విమర్శించారని తెలిపారు. తాను ప్రలోభాలకు లొంగిపోయానని జగన్ అన్నారని,ఆ వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలని విజయసాయి రెడ్డి కోరారు.

వైసీపీలో నంబర్ 2 స్థానం అనేది లేదని స్వయంగా వైఎస్ జగన్ చెప్పారని ఈడీకి తెలిపినట్లు సాయిరెడ్జి వెల్లడించారు. ప్రాంతీయ పార్టీల్లో నంబర్ 2 అనేది ఉండదని చెప్పానన్నారు. కేసులు చుట్టుముట్టిన తర్వాతే నన్ను 'నంబర్2'గా ప్రచారం చేశారన్నారు. ఈడీ విచారణలో అడిగిన ప్రశ్నల్లో కొన్ని మాత్రమే రికార్డు చేశారని, మరికొన్ని ప్రశ్నలను రికార్డు చేయలేదన్నారు. లిక్కర్ స్కాం గురించి తనకు తెలియదని, లిక్కర్ స్కాంలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వారినే అడగాలని చెప్పానన్నారు.

సాయిరెడ్డి వందల కోట్లు దోచేశారంటూ వైసీపీ సోషల్ మీడియా చేసిన ప్రచారానికి స్పందించి తన ఆస్తుల వివరాలు ఇచ్చానని సాయిరెడ్డి తెలిపారు. తన అల్లుడి సంస్థ అరబిందో ఆస్తులకూ తనకూ సంబంధం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన నీచమైన పని విశాఖలో తన ఆస్తులపై విచారణకు సిట్ ను పంపడం అన్నారు. ఆస్తులు కొంటే ఆ డబ్పులు ఎక్కడి నుంచి వచ్చాయన్నది విచారణ చేయించుకోవాలని కోరానన్నారు. చంద్రబాబు చేసిన ఈ దుష్టపని తాను మర్చిపోలేనన్నారు. కూటమి ప్రభుత్వం తనను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతోందన్నారు. విశాఖలో తనకు ప్లాట్ తప్ప ఏ ఆస్తీ లేదన్నారు. తన కోరికంతా రాజకీయాల్లోకి తిరిగా రావాలన్నదే అన్నారు. తిరిగి ప్రజాసేవలోకి వచ్చి తనపై దుష్ప్రచారం చేసిన వారికి బుద్ధి చెప్పడమే అన్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications