ల్యాండ్పూలింగ్పై బాబుకు షాక్: కోర్టులో రైతుకి ఊరట
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకిస్తున్న రైతులకు హైకోర్టులో గురువారం నాడు ఊరట లభించింది. తమ అంగీకర పత్రాలను తిరిగి వెనక్కి తీసుకుంటామని రైతులు వేసిన పిటిషన్కు హైకోర్టులో సానుకూల తీర్పు వచ్చింది.
తమ అంగీకార పత్రాలను వెనక్కి తీసుకుంటామన్న రైతుల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని ప్రభుత్వం ఈ సందర్భంగా హైకోర్టుకు తెలిపింది. 15 రోజుల్లోగా ఈ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయాలని, ఇందుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు సీఆర్డీఏను ఆదేశించింది.
భూసమీకరణకు భూమిని ఇచ్చేందుకు వ్యతిరేకిస్తున్న వారిని మినహాయించాలని హైకోర్టు సీఆర్డీఏకు చెప్పింది. ఇష్టం లేని రైతులను సమీకరణ జాబితా నుండి తొలగించాలని సీఆర్డీఏను ఆదేశించింది. కాగా, అంగీకార పత్రాలను వెనక్కి తీసుకుంటామన్న రైతుల దరఖాస్తుల పైన కోర్టుకు నివేదిక ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది.