నాగార్జునకు ఊరట!: ఎన్ కన్వెన్షన్పై మధ్యంతర ఉత్తర్వు
హైదరాబాద్: ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ అక్రమ కట్టడమని అధికారులు మార్కింగ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో అక్కినేని నాగార్జున రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణకు స్వీకరించింది. నాగార్జున పిటిషన్ స్వీకరించిన కోర్టు... యధాతథ స్థితిని కొనసాగించాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ రాజశేఖర్ రెడ్డి సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్ కన్వెన్షన్ను లీజుకు తీసుకున్న ఎంటర్ ప్రైజెస్ ప్రతినిధి ప్రీతమ్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండింటి పైన పూర్తిస్థాయి విచారణ చేపట్టడానికి న్యాయమూర్తికి సమయం లేక ప్రక్రియను మంగళవారానికి వాయిదా వేశారు.

కాగా, ఎన్ కన్వెన్షన్ సెంటర్ గోడల పైన అక్రమ నిర్మాణమని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం మార్క్ చేసిన విషయం తెలిసిందే. రెడ్ కలర్తో వారు మార్క్ చేశారు.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. సెక్షన్ 452 ప్రకారం వారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యానికి వారం రోజుల గడువు ఇవ్వనున్నారు. యాజమాన్యం నోటీసులు తీసుకోకుంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ గోడలకు నోటీసులు అంటించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications