వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోసం చేయడం కెసిఆర్ నైజం, అవమానమే: రేవంత్

|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావును తెలంగాణ జాతిపిత అంటూ పొగడటం ఇక్కడ ప్రజలను అవమానించడమేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నమ్మిన వారిని మోసం చేయడమే కెసిఆర్ లక్ష్యమని ఆరోపించారు.

తెలంగాణ ఇస్తామన్నా.. కాంగ్రెస్ పార్టీలో టిఆర్‌ఎస్‌ను ఎందుకు విలీనం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రావాలంటే కాంగ్రెస్‌లో టిఆర్ఎస్ విలీనం కావాల్సిందేనని అన్నారు. కెసిఆర్‌కు తెలంగాణ రావడం ఏ మాత్రమం ఇష్టం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. చరిత్రలో గుర్తింపు ఇచ్చిన పార్టీనే నాశనం చేయడం కె చంద్రశేఖర్ రావు నైజమని ఆయన విమర్శించారు. బడుగు, బలహీన వర్గాలకు వేదికైన తెలుగుదేశం పార్టీని బలహీన పరచాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

హై సెక్యూరిటీ నెంబర్ పేట్లను రద్దు చేయాలి

రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లోకి తీసుకువచ్చిన హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం రవాణా శాఖకు లేఖ రాశారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన సమయంలో హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను ఎలా అమలు చేస్తారని టిడిపి ఎమ్మెల్యేలు బొజ్జల గోపాలకృష్ణయ్య, మండల వెంకటేశ్వర్ రావు, జయపాల్ యాదవ్‌లు ఈ మేరకు లేఖలో పేర్కొన్నారు.

పొరుగు రాష్ట్రాల్లో హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను తయారీ ధర కంటే 25శాతం తక్కువగా ఇస్తున్నప్పుడు మన రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా ఎలా విక్రయాలు కొనసాగిస్తారని ప్రశ్నించారు. వెంటనే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల అమలును రద్దు చేయాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు.

English summary
Telugudesam Party senior leader Revanth Reddy on Monday fired at Telangana Rashtra Samithi President K Chandrashekar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X