మీ దేవతే అధికారాలిచ్చింది: కెసిఆర్పై రేవంత్ ఫైర్

ఆ దేవతే గవర్నర్కు అధికారాలిచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభకు వచ్చిన విభజన బిల్లులోనే గవర్నర్కు అధికారాల విషయం ఉందని చెప్పారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలవడానికి కారణం కెసిఆరేనని ఆరోపించారు.
విద్యార్థుల బలిదానాల వల్లే తెలంగాణ వచ్చిందన్న రేవంత్ రెడ్డి.. వారినే ఇప్పుడు పోలీసులతో తన్నిస్తున్నారని కెసిఆర్పై మండిపడ్డారు. ఉద్యోగాల కోసం దీక్షలు చేస్తున్న విద్యార్థులతో ఎందుకు చర్చలు జరపరని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్ సమస్య తీర్చమని అడిగిన రైతుల కాళ్లు విరగ్గొడుతున్నారని, ఉద్యోగాలు అడుగుతున్న విద్యార్థులను పోలీసులతో కొట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
విద్యార్థుల త్యాగాల వల్లే టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన విషయం మరిచిపోరాదని హితవు పలికారు. మంత్రి హరీశ్ రావు లేఖ రాయాల్సింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి కాదని.. తెలంగాణ సిఎం కెసిఆర్కు అని రేవంత్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications