చంద్రబాబు ఉండవల్లి నివాసానికి నోటీసులు: కృష్ణా వరదే కారణం!
అమరావతి: పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జరీ చేశారు. కాగా, పులిచింతల నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో 5.11 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 5.06లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈ రాత్రికి వరద ఉధృతి 8 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇక బ్యారేజీ దిగువ ప్రాంతంలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. యనమలకుదురు, పెదపులిపాక, కేసరనేనివారిపాలెం, మద్దూరు ప్రాంతాల్లో కృష్ణానదిని ఆనుకుని ఉణ్న పంట పొలాలు జలమయమయ్యాయి. నదికి సమీపంలోని నివాసాలు, ఆలయాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇది ఇలావుంటే, కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ఉండవల్లిలోని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి స్థానిక రెవెన్యూ అధికారులు నోటీసులు అంటించారు. ఎగువ నుంచి సుమారు 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండటంతో కృష్ణా కరకట్టపై ఉన్న నివాసాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు నివాసానికి కూడా నోటీసులు అంటించారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఈ నోటీసులు అంటించలేదని.. అప్రమత్తంగా ఉండాలని మాత్రమే అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. వరద వచ్చిన సమయంలో గతంలో కూడా అధికారులు ఈ విధంగా నోటీసులు జారీ చేశారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications