నంద్యాల ఉపఎన్నికపై ఆర్జీ ఫ్లాష్ టీం సర్వే! టీడీపీకే గెలుపు ఛాన్స్?
నంద్యాల ఉపఎన్నికపై ఆర్జీ ఫ్లాష్ టీం తన సర్వేలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయో వెల్లడించింది. ఏబీఎన్ (ఆంధ్రజ్యోతి) కోసం ఆర్జీ ఫ్లాష్ టీం ప్రత్యేకంగా సర్వే చేసింది. ఆ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.
అమరావతి: నంద్యాల ఉపఎన్నికపై ఆర్జీ ఫ్లాష్ టీం తన సర్వేలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయో వెల్లడించింది. ఏబీఎన్ (ఆంధ్రజ్యోతి) కోసం ఆర్జీ ఫ్లాష్ టీం ప్రత్యేకంగా సర్వే చేసింది. ఆ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.
ఓట్ల శాతం.. ఎవరికెంత?
టీడీపీ : 54.00 % - 56.78 %
వైసీపీ: 36.00 % - 38.53 %
కాంగ్రెస్ : 3.00 % - 4.49 %
ఇతరులు: 5.00 %
ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వేలో టీడీపీకి అత్యధికంగా 54.00 శాతం నుంచి 56.78 శాతానికిపైగా ఓట్లు పడే అవకాశం ఉందని తేలింది. నంద్యాల కోటలో టీడీపీ జెండా ఎగురవేస్తుందని కూడా సర్వే వెల్లడించింది.

ఇక వైసీపీ రెండో స్థానంలో ఉందని 36.00 శాతం నుంచి 38.53 శాతం ఓట్లు దానికి వస్తాయని, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ తో కలుపుకొని సర్వే ఈ నంబర్ వెల్లడించింది. టీడీపీ సంగతే తీసుకుంటే... 54 శాతానికిపైగా ఓట్లు కచ్చితంగా వస్తాయని, గరిష్టంగా 56.78 శాతం వచ్చే అవకాశాలున్నాయని సర్వే పేర్కొంది.
రెండో స్థానంలో ఉన్న వైసీపీకి కనీసం 36 శాతం ఓట్లు వచ్చేలా కనిపిస్తున్నాయని, గరిష్టంగా, ఊపును బట్టి 38.53 శాతం వరకూ రావొచ్చని ఫ్లాష్ టీమ్ సర్వే ఘంటాపథంగా చెబుతోంది.
ఇక మైనారిటీ అభ్యర్థిని నిలబెట్టి వ్యూహాత్మకంగా బరిలో దిగిన కాంగ్రెస్ 3 శాతం వరకూ ఓట్లు చీల్చగల్గినట్టు కనిపిస్తోందని, గరిష్టంగా 4.49 శాతం వరకూ ఓట్లు కాంగ్రెస్ కి పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక రాయలసీమ సాధన సమితి, ఇండిపెండెంట్లు లాంటి అభ్యర్థులంతా 5 శాతం వరకూ ఓట్లు చీల్చినట్టు కనిపిస్తున్నారని ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే వెల్లడించింది. టీడీపీ వైపీసీ మద్య మార్జిన్ దాదాపు 18 శాతానికిపైగా ఉంది కాబట్టి...ఈ ఇతరులు కానీ కాంగ్రెస్ కానీ ఫలితాన్ని తారుమారు చేయలేవని తెలిపింది.
అధికార విపక్షాల మధ్య ఓట్ల తేడా 18 శాతానికిపైగానే ఉంటుందని, అంతే ఉజ్జాయింపుగా లెక్కేస్తే దాదాపు 20 వేల మెజారిటీ రావడం ఖాయమని ఫ్లాష్ టీమ్ సర్వేలో తెలిపింది. మామూలుగా పదిశాతం ఓట్లు అంటే నంద్యాల్లో ఉన్న పరిస్థితిని బట్టీ పదివేల ఓట్లు తేడా ఉంటుందని ముందు నుంచి లెక్కలు వస్తున్నాయ్.
అంటే ఈ సర్వేని బట్టీ మార్జిన్ 18 శాతం వరకూ ఉంది కాబట్టి 20 వేలకిపైగా మెజారిటీ రావడం ఖాయంగా అనిపిస్తోందని సర్వే తెలిపింది. సర్వే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 2 శాతంగా ఉందని, అంటే ఫలితం కాస్త అటు ఇటుగా ఉండొచ్చని, రెండు శాతం ఓట్లు ఎక్కువ కూడా వచ్చే అవకాశముందని ఈ సర్వే చెబుతోంది.
అందుకే టీడీపీకి 54 నుంచి 56 శాతం ఓట్లు వస్తాయని సర్వే లెక్కేస్తోంది. వైసీపీకి కూడా కనీసం 36 శాతం, గరిష్టంగా 38 శాతం వస్తాయని సర్వే తెలిపింది. 36 శాతం కన్నా కొంచెం పెరిగే అవకాశమే కానీ తగ్గే ఛాన్స్ లేదని ఆర్జీ ఫ్లాష్ టీం సర్వే తేల్చి చెబుతోంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications