చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘోర ప్రమాదం: బస్సు కిందికి దూసుకెళ్లిన కారు, ఐదుగురు మృతి

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: జిల్లా బైరెడ్డిపల్లి మండలం మెట్టకురవపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కారును ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారు బస్సు కింద ఇరుక్కోవడంతో నుజ్జునుజ్త్జెంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు, డ్రైవరు, ఓ బాలిక అక్కడికక్కడే మృతిచెందారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు సుమిత్ర(25), మేనక(3), వేణుగోపాల్‌(22), కళమ్మ(55), రమణమ్మ(45)గా పోలీసులు గుర్తించారు.

Road accident: 5 persons killed

బాధితులంతా బైరెడ్డిపల్లిలోని ఓ వివాహానికి వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులందరూ బైరెడ్డిపల్లి మండలం మిట్టకురపల్లికి చెందినవారని చెప్పారు.

ఇది ఇలా ఉండగా, తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

English summary
Five persons killed in a road accident in Chittoor district on Friday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X