ఏపీ మంత్రి బాలినేనికి తప్పిన ప్రమాదం: కాన్వాయ్ వాహనం బోల్తా, కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురైంది. గచ్చిబౌలి నుంచి విజయవాడకు వెళ్తుండగా పెద్దఅంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఎస్కార్ట్ వాహనం టైర్ పేలి పల్టీలు కొట్టింది. ఈ క్రమంలో మరో బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కాన్వాయ్లో ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పాపయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మరో ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హయత్ నగర్లోని ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదం నుంచి మంత్రి క్షేమంగా బయటపడ్డారు. మృతి చెందిన కానిస్టేబుల్ పాపయ్య కుటుంబానికి మంత్రి బాలినేని శ్రీనివాస్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి చెప్పారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బందిని పరామర్శించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
హైదరాబాద్ ఫేమస్ ఉస్మానియా బిస్కెట్ ను చెడగొట్టారు కదరా.. దరిద్రుల్లారా -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
మూసీ తీరాన మహత్తరం -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు!












Click it and Unblock the Notifications