మహిళపై తొలిసారి రౌడీషీట్ తెరిచారు: బస్సుల ఢీ, ఇద్దరు మృతి
విజయవాడ: రౌడీ షీటర్లంటే నేరాలకు పాల్పడే పురుషులే గుర్తుకు వస్తారు. అయితే, అందుకు భిన్నంగా ఓ మహిళపై కృష్ణా జిల్లా విజయవాడ పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. నగరంలో గత 15 ఏళ్లలో ఓ మహిళపై రౌడీ షీట్ తెరవడం ఇదే తొలిసారి.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 32ఏళ్ల మహిళపై మాచవరం పోలీస్ స్టేషన్లో ఈ రౌడీషీట్ తెరిచారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. నేరాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో ఆమెపై రౌడీ షీట్ తెరిచినట్టు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులు చూస్తూ ఊరుకోరని వారు స్పష్టం చేశారు.

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ: ఇద్దరు మృతి
చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి నుంచి వస్తున్న ఓ ఆర్టీసీ బస్సును, శ్రీకాళహస్తి నుంచి వస్తున్న మరో ఆర్టీసీ బస్సు ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. రెండు బస్సుల్లో మొత్తం 80మంది ప్రయాణికులున్నారు. వీరిలో దాదాపు 30మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా పూతలపట్టు-నాయుడిపేట ప్రధాన రహదారిపై దాదాపు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.
తండ్రిపై కుమారుడి దాడి
కర్నూలు: కన్న కొడుకే కత్తితో దాడి చేయడంతో ఓ తండ్రి ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. రుద్రవరం మండలం ఆలమూరులో తండ్రిపై కొడుకు సోమవారం ఉదయం కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు వెంటనే తండ్రిని ఆస్పత్రిలో చేర్పించారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications