తొక్కాలనే: పవన్పై రోజా, జగన్ ఓటమితో డిఎల్ మొక్కు
హైదరాబాద్: జగన్ అనే ఒక్క వ్యక్తిని తొక్కేయాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇలా అందరు ఒక్కటయ్యారని, దీనిని ప్రజలు కళ్లారా చూశారని నగరి నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రముఖ నటి రోజా అన్నారు. టిడిపికి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడే రోజు వస్తుందని ఆమె జోస్యం చెప్పారు.
జగన్ సముద్రాలు కూడా మిగిల్చే వాడు కాదు: డిఎల్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే సముద్రాలను కూడా మిగిల్చి ఉండేవాడు కాదని మాజీ మంత్రి, కడప జిల్లా సీనియర్ నేత డిఎల్ రవీంద్రా రెడ్డి ఆదివారం అన్నారు. పదేళ్ల కాంగ్రెసు పార్టీ పాలన పూర్తిగా అవినీతిమయమైందన్నారు.

ఆ అవినితిలో తాను భాగస్వామిని కాలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు అవినీతిరహిత పాలన రావాలని తాను కోరుకున్నానని, అందుకు అనుగుణంగానే ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేస్తున్నారన్నారు.
డిఎల్ రవీంద్రా రెడ్డి ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
దేశాన్ని పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని మండిపడ్డారు. ఆ తల్లి కాంగ్రెస్ నుంచి పుట్టిందే పిల్ల కాంగ్రెస్ అన్నారు. అవినీతిపరుడైన జగన్ అధికారంలోకి రాకూడదని నిష్ఠతో కోరుకున్నానని అది తీరడంతో మొక్కు తీర్చుకున్నానని చెప్పారు. విశాఖలో విజయమ్మ గెలిస్తే సముద్రం కూడా మిగిలేది కాదన్నారు. రాష్ట్రాన్ని నువ్వే కాపాడాలి దేవుడా అని తాను మొక్కుకున్నానని, తన కోరిక తీరిందన్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications