పవన్! మాటమీద నిలబడే వ్యక్తి కాదు: రోజా సంచలనం
జనసేన అధినేత పవన కళ్యాణ్ ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తికాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు.
తిరుపతి: ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన కళ్యాణ్ ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తికాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. బుధవారం ఆమె తిరుమలేశుడిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటికీ, ఇప్పటికీ ఆయన ఇస్తున్నవాగ్దానాలు, హామీల్లో చాలా మార్పు ఉందని, నిలకడ లేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నిస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎమ్మెల్యేను పిలిచి అవమానించిన కర్నూలు ఘటనతోనే చంద్రబాబు దౌర్జన్యం అందరికీ అర్థమైందన్నారు.అంతేగాక, చంద్రబాబు పాలన మూడు మోసాలు, ఆరు అబ్ధాలుగా సాగుతోందని ఆమె ఎద్దేవా చేశారు.
యూపీ రాజకీయాలు చూసి ఏపీలో చంద్రబాబుకు బీపీ వచ్చిందని, అక్కడ అఖిలేష్ లాగానే ఇక్కడ లోకేష్ కూడా తనను ఎక్కడ అధికారంలో నుంచి దింపేస్తారనే భయం పట్టుకుందని అన్నారు. ఆ భయంతోనే లోకేష్ ను మంత్రి చేయడానికి చంద్రబాబు వెనుకాడుతున్నారని అన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంకు నీళ్లు ఇవ్వని చంద్రబాబు.. పులివెందులకు నీళ్లు ఇస్తామంటే జనం ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.