దద్దమ్మలు, గాడిదలు ఆ దద్దమ్మ బాబే, స్త్రీలపై అఘాయిత్యాలు చేస్తూ: ఊగిపోయిన రోజా
విశాఖపట్నం: ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, యనమల రామకృష్ణుడులపై రోజా నిప్పులు చెరిగారు. విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో వంచన వ్యతిరేక దీక్ష సందర్భంగా వారిపై ఆమె దుమ్మెత్తిపోశారు. తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇంతకుముందే ప్రెస్ మీట్ పెట్టారని చెప్పారు.
'జగన్ పులివెందుల నుంచి పోటీ చేయరు, వైసీపీలో గుసగుస! వారం నుంచి కనిపించని విజయసాయి'
ఆయనకు వయస్సు అయితే పెరిగింది కానీ బుర్ర పెరగలేదు, బుద్ధి పెరగలేదని తెలిసిపోయిందన్నారు. రాజధానికి పోలవరం ప్రాజెక్టుకు జగన్ అడ్డంకి అని ఆయన చెబుతున్నారని, కానీ ఆయనను తాను ఓ ప్రశ్న అడుగుతున్నానని, ఇన్నాళ్లు మీరు పెద్దవారని గౌరవం ఇచ్చామని, ఒక ఆర్థిక మంత్రిగా ఉండి రెవెన్యూ లోటును పూడ్చలేని నువ్వు ఒక మంత్రివా అని అడుగుతున్నానని అన్నారు.
చేతకాని దద్దమ్మవు నువ్వు, జగన్ గురించి మాట్లాడుతావా?
ఈ రోజు జీఎస్టీ కౌన్సెల్లో ఓ మెంబర్గా ఉన్న యనమల నష్టాల్లో ఉన్న ఏపీకి జీఎస్టీ మినహాయింపులు తీసుకురాలేకపోయారని రోజా మండిపడ్డారు. నువ్వో చేతకాని దద్దమ్మవు.. అలాంటి నువ్వు జగన్ గురించి మాట్లాడుతావా అని మండిపడ్డారు. కేసుల గురించి జగన్ ప్రతి శుక్రవారం వెళ్తున్నాడని మాట్లాడుతున్నారని, ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎప్పుడు పిలిచినా కోర్టుకు వెళ్తున్నారన్నారు.
చేతకాని దద్దమ్మలు, మీ దోపిడీని కేంద్రం బయటకు తీస్తుంటే
చంద్రబాబు, లోకేష్, నువ్వు (యనమల) నీ మంత్రులు తప్పు చేశారు కాబట్టి ఎక్కడ బీజేపీ కేసులు పెడితే జైల్లో కూర్చుంటామో అనే భయంతో ఆ పార్టీతో లాలూచీపడి మీ ఎంపీలతో రాజీనామా చేయించని చేతకాని దద్దమ్మలు మీరు అని రోజా అన్నారు. రైతుల కల అయిన పోలవరం మేం ఆపుతామా అన్నారు. చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు పోలవరం ఎక్కడుందో తెలియదన్నారు. రైతుల కలను నిజం చేయాలని వైయస్ పోలవరం నిర్మాణానికి పూనుకున్నారన్నారు. కేంద్రం కట్టాల్సిన జాతీయ ప్రాజెక్టును కాంట్రాక్టులు, కమీషన్ల కోసం మీరు తీసుకున్నారని టీడీపీపై నిప్పులు చెరిగారు. మీరు చేసిన దోపిడీ కేంద్రం గుర్తించి, ఆ ప్యాకేజీల్లో మీ బినామీలు దోచుకున్న దానిని బయటకు తీస్తుంటే మేం ఆపామని అంటారా అని మండిపడ్డారు.
సిగ్గులేకుండా మమ్మల్ని అంటారా?
మాపై ఆరోపణలు చేసేందుకు సిగ్గులేదా అని రోజా అన్నారు. మీరు అన్నింట్లో దోచుకుంటున్నారని, మీ తప్పుల వల్ల అన్నీ ఆగిపోతున్నాయని, వాటిని వైసీపీ పైకి నెడుతారా అని ప్రశ్నించారు. మీది చేతకానితనం అన్నారు. మీకు దోచుకోవడానికి, దాచుకోవడానికే సమయం సరిపోవడం లేదని అన్నారు. రాజధానికి జగన్ అడ్డుపడుతున్నారని మంత్రి యనమల రామకృష్ణుడు చెబుతున్నారని, ఆయనకు వయస్సు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదన్నారు.
మట్టి, నీళ్లు అందుకున్న దద్దమ్మ చంద్రబాబు
ఆయన ఇంకొకడు ఉన్నాడు... ఈ కేబినెట్లో దేవినేని ఉమ... ఆయన నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మోడీ మట్టి, నీరు తీసుకొచ్చి ఇస్తే ఎలా తీసుకున్నారని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని రోజా అన్నారు. మోడీ మట్టి, నీళ్లు ఇచ్చినప్పుడు నిలదీయలేని దద్దమ్మ జగన్ అని దేవినేని చెప్పారని, కానీ ఆ మట్టి, నీళ్లు తీసుకున్న దద్దమ్మలు ఎవరు అని ప్రశ్నించారు. అప్పుడు ఈ దద్దమ్మలు వాటిని ఎందుకు తీసుకున్నారన్నారు. ఇప్పుడు సిగ్గులేకుండా జగన్ పైన విమర్శలు చేస్తున్నారా అన్నారు. మోడీ మట్టీ, నీళ్లు ఇచ్చినప్పుడు చంద్రబాబు అందుకున్నారని, అప్పుడు ఈ మంత్రులు మాట్లాడలేదని, అప్పుడు గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు. అదే మట్టీ, నీళ్లు హెలికాప్టర్లో చంద్రబాబు చల్లుదుంటే ఈ మంత్రులు గాడిదకు పళ్లు తోముతున్నారా అని నిలదీశారు. మోడీ మట్టి నీరు ఇస్తే అందుకున్న దద్దమ్మ చంద్రబాబు అయితే, చూస్తున్న దద్దమ్మలు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అన్నారు. వీళ్లు ఎందుకు ఆపలేదన్నారు.
మహిళలపై అఘాయిత్యాలు చేస్తూ బతుకుతున్న నువ్వా
రోజా ఇంకా మాట్లాడుతూ.. 'ఇంకా సిగ్గుచేటు ఏమిటంటే ఏడీఆర్ ఇచ్చిన రిపోర్టులో మహిళల మీద అట్రాసిటీ చేసే అయిదుమంది ముగ్గురు మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు.. ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటే ఆ ఐదుమంది తెలుగుదేశం పార్టీలో ఉండటం సిగ్గుచేటు అయితే అందులో ఒక మంత్రి దేవినేని ఉమ. మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ అరాచకాలు చేస్తూ బతుకుతున్న ఇతనికి రాజీనామా చేయకుండా జగన్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అనే నేను అడుగుతున్నా. మీరు ఎర్రన్నాయుడు, శంకర్రావు, కాంగ్రెస్తో జతకలిసి రాజకీయ కక్షసాధింపుగా కేసులు వేసి జగన్ ఏదో తప్పు చేసినట్లు నేరస్తుడు అన్నట్లు మాట్లాడుతున్నారే టైం వచ్చింది మీరు చేసిన తప్పులు, పాపాలు పండుతాయి.' అని నిప్పులు చెరిగారు.
జీవితాంతం జైల్లో, జగన్ అనే నేను కోసం ఎదురుచూపు
'ఏదైతే లోకేష్ గారు చేసిన ఓట్ల మార్పిడి కుంభకోణం గానీ ఓటుకు నోటు కేసు గానీ రాజధాని భూముల్లో మీరు దోచుకున్న ఏ ఒక్క కేసు కనుక విచారణకు వచ్చినా జీవితాంతం జైల్లో ఉంటారు చంద్రబాబు నాయుడు... నువ్వు నీ కేబినెట్ నీ కొడుకు' అని మండిపడ్డారు. చంద్రబాబు చేస్తోంది పోరాటం కాదని పబ్లిసిటీ ఆరాటం అన్నారు. మేం చేస్తోంది మీకు వ్యతిరేకంగా చేస్తోన్న దీక్ష కాదన్నారు. ఎంతటివాడితోనైనా ప్రజల కోసం పోరాడే వీరుడు, దమ్మున్న నేత జగన్ అన్నారు. ప్రజలు 'జగన్ అనే నేను' కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.