రూ. 45 లక్షలతో పట్టుబడిన పార్థసారథి సతీమణి

Rs 45 lakha seized from Parthasarathy's wife
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసి బస్సులో తరలిస్తున్న 45 లక్షల రూపాయల నగదును వనస్థలిపురం వద్ద పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి కె. పార్థసారథి సతీమణి కమల బ్యాగ్‌లో ఈ మొత్తాన్ని తీసుకుని వెళ్తూ పోలీసులకు చిక్కారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఈ డబ్బులు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కమలతో పాటు ఆమె వెంట ప్రయాణిస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై కమలను పోలీసులు విడుదల చేశారు. పార్థసారథి మచిలీపట్నం లోకసభ స్థానం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన పార్థసారథి ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీలో చేరుతారని భావించారు. కానీ, ఆయన వైయస్ జగన్ వైపు వచ్చారు.

ఇదిలావుంటే, విజయవాడ పాతబస్తీ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో తరలిస్తున్న పది లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+