మహిళల ఖాతాల్లో 3500 వేసిన చంద్రబాబు... మహిళా దినోత్సవం కానుకగా పసుపుకుంకుమ
ఏపీలోని మహిళలకు మహిళా దినోత్సవం కానుక ఇచ్చారు చంద్రబాబు. పసుపు కుంకుమ పధకం ద్వారా రెండ విడత నగదును మహిళల అకౌంట్ లలో వేశారు. మహిళలకు ఈ రోజు (మార్చి-7-2019) శుభ దినం అన్న చంద్రబాబు పసుపు-కుంకుమ పథకం రెండో విడత సొమ్మును మహిళల ఖాతాలో జమచేశామన్నారు. ఒక్కో మహిళ ఖాతాలో రూ.3,500 డిపాజిట్ చేశామన్నారు. పసుపు-కుంకుమ పథకం కింద మరో విడతలో రూ.4వేల నగదును మరోసారి అందజేస్తామన్నారు. అమరావతిలో టీడీపీ నేతలు, బూత్ స్థాయి కన్వీనర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడారు.

రేపు మార్చి-8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరి ఖాతాల్లోకి నగదు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చెప్పారు. రేపు ఏపీ అంతటా డ్వాక్రా మహిళలు సంతోషంతో ర్యాలీలు నిర్వహించబోతున్నారని వెల్లడించారు.మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని చెప్పిన సీఎం చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆడబిడ్డల అండ టీడీపీకి మెండుగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు .
-
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?












Click it and Unblock the Notifications