ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై కిరణ్కు హైకోర్టు షాక్

గవర్నర్ నరసింహన్ తొలుత ఆమోదించని ఇంతియాజ్, విజయ నిర్మల, వెంకటేశ్వర్లు, తాంతియా కుమారిల నియామకంపై పునరాలోచన చేయాలని, వారి స్థానంలో ఆరు వారాల్లోగా కొత్త వారిని నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గవర్నర్ ఆమోదించని ఇంతియాజ్, విజయ నిర్మల, వెంకటేశ్వర్లు, తాంతియా కుమారిలను తొలగించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే స్వచ్ఛంధ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు నలుగురి నియామకంపై పునఃసమీక్షించి, కొత్త వారిని నియమించాలని ఆదేశించింది.
కాగా, ఎనిమిది మందిని ఆర్టీఐ కమిషనర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో గవర్నర్కు ఫైల్ పంపగా, అందులో నలుగురికి గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. ఆ నలుగురి ఫైలును ప్రభుత్వం మరోసారి పంపించి గవర్నర్చే ఆమోద ముద్ర వేయించుకుంది. దీంతో స్వచ్ఛంధ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అప్పుడు విజయ్ బాబు, ప్రభాకర్, మధుకర్ రాజు, రతన్లకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఇంతియాజ్, విజయ నిర్మల, వెంకటేశ్వర్లు, తాంతియా కుమారిల ఫైలును కిరణ్ ప్రభుత్వం రెండోసారి పంపించి ఆమోద ముద్ర వేయించుకుంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications