నవ్వుతూనే ముంచారు: సోనియాపై సాయి ప్రతాప్ ఫైర్

అందరికీ చెప్పే నిర్ణయం తీసుకున్నామని సోనియా గాంధీ అంటున్నారని, అయితే ఇది పచ్చి అబద్ధమని ఆయన అన్నారు. నిర్ణయం తీసుకుంటున్నామని అసలెవరికి చెప్పారో కూడా తెలియదన్నారు. తాము చివరి వరకూ సమైక్యాంధ్ర డిమాండ్నే వినిపించామని చెప్పారు. తాను భగవద్గీతపై ప్రమాణం చేసి మరీ చెబుతానని.. తమకు పదవులు ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ బిల్లు ఆమోదం పొందబోదని దీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. శిక్షపడ్డ ప్రజాప్రతినిధులను కాపాడేందుకు కేబినెట్ జారీ చేసిన ఆర్డినెన్స్ను చించి పారేయాలని రాహుల్ గాంధీ చెప్పినప్పుడు.. ఎనిమిది కోట్ల మంది ఐక్యతను కాపాడేందుకు తెలంగాణ పై కేబినెట్ నోట్ను ఎందుకు చించే యకూడదని సాయిప్రతాప్ ప్రశ్నించారు.
35 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న కాంగ్రెస్వాదిగా తాను కేబినెట్ నోట్ను వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని చెప్పారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని రాహుల్ వ్యతిరేకించారని ఆయన అన్నారు. ఇతర కాంగ్రెస్ నేతలు తెలంగాణపై నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే తప్పేమిటని ప్రశ్నించారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications