వైసీపీ మార్పులపై ప్లీనరీలోనే -బీజేపీకి మద్దతివ్వలేదు-వెంకయ్యపై టీడీపీ షాక్-సజ్జల కామెంట్స్
ఏపీలో మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వైసీపీ సర్కార్.. పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 7,8 తేదీల్లో గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఈ ప్లీనరీ జరగబోతోంది. ఈ నేపథ్యంలో పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన వందశాతం హామీల్ని పూర్తి చేసిందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పార్టీ ప్లీనరీ నిర్వహణ ఏర్పాట్లపై బిజీగా ఉన్న ఆయన.. ఇవాళ మీడియాతో మాట్లాడారు. వైసీపీలో సంస్ధాగత మార్పులపై ప్లీనరీలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటికే ప్లీనరీలో వైసీపీ ప్రకటించే నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో సజ్జల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అలాగే తాజాగా వైసీపీ ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ చేసిన వ్యాఖ్యలపైనా సజ్జల స్పందించారు. కేంద్రంలో బీజేపీకి వైసీపీ మద్దతుపై దాపరికాలేమీ లేవంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు. బీజేపీ, వైసీపీ సిద్ధాంతాలు వేర్వేరన్నారు. అలాగే బీజీపీ పెట్టిన ఏ బిల్లుకీ మద్దతివ్వలేదని సజ్జల చెప్పుకొచ్చారు. మరోవైపు వెంకయ్య నాయుడికి రాష్ట్రపతి పదవి అంశంపైనా సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యకు రాష్ట్రపతి పదవి రాకపోడంతో టీడీపీ షాక్ కు గురైందన్నారు.
అందుకే టీడీపీ నేతలు నోరెత్తడం లేదని సజ్జల వ్యాఖ్యానించారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications