టీలో అధికారంలోకి, 'సాక్షి' మీడియా కోసం: అమిత్ షా, చురకలు
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, తెలంగాణలో 35 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గురువారం చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆయన పర్యటిస్తున్నారు. తెలంగాణలో సభ్యత్వ నమోదుపై ఆరా తీశారు. ఉదయం తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
నరేంద్ర మోడీ వచ్చాక ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. ఈ ఏడు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా తగ్గాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేలా పని చేస్తామన్నారు. తెలంగాణలో బీజేపీకి 22 శాతం ఓట్లు వచ్చాయన్నారు.
నిరుద్యోగ సమస్య నిర్మూలనకు మోడీ చర్యలు చేపట్టారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. బడ్జెట్లో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కృషి చేస్తామన్నారు.ప్రధాననమంత్రి జన్ధన్ యోజన గొప్ప పథకమన్నారు. ఇప్పటి దాకా 10కోట్ల ఖాతాలు తెరిచారన్నారు.

అమిత్ షా
మేక్ ఇన్ ఇండియా, సిల్క్ డెవలప్మెంట్కు విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. రైతులకు మద్దతు ధరే తమ లక్ష్యమన్నారు. బ్లాకమనీని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇందుకు సిట్ కసరత్తు చేస్తోందని, నెలరోజుల్లో నల్లధనం లిస్టును సుప్రీంకు ఇచ్చామన్నారు. యూపీఏ చేయలేని పనిని తాము చేసి చూపించామన్నారు.

అమిత్ షా
గుజరాత్లా తెలంగాణ, జార్ఖండ్ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు. బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ చేసిన వ్యాఖ్యల పైన కూడా షా స్పందించారు. అలాంటి మాటలు పార్టీకి నష్టం కలిగిస్తాయన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు అలా మాట్లాడిన నష్టమే అన్నారు. సాక్షి మహారాజ్ చేసిన వ్యాఖ్యలను పార్టీ సమర్థించదన్నారు.

అమిత్ షా
ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమన్నారు. అలాంటి వ్యాఖ్యల ప్రభావం తమ అభివృద్ధి అజెండా పైన పడదన్నారు. సాక్షి మహారాజ్ మీడియా కోసం ప్రకటనలు చేస్తుంటాడని చతుర్లు వేశారు.

అమిత్ షా
మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యల పైన స్పందిస్తూ.. బలవంతపు మతమార్పిళ్లు సరికాదన్నారు. బలవంతపు మతమార్పిడుల నివారణకు అందరు సహకరించాలని కోరారు.

అమిత్ షా
ఒక్క సోకాల్డ్ సెక్యులర్ పార్టీ కూడా ఇందుకు మద్దతు పలకడం లేదని విమర్శించారు. మీడియాలో విస్తృత చర్చ ద్వారా బలవంతపు మతమార్పిళ్లు ఆపగలమా, దేశాన్ని మీడియా నడిపిస్తోందా లేక చట్టమా, చట్టమే దేశాన్ని నడిపిస్తున్నప్పుడు.. గట్టి చట్టం తీసుకు రావాలన్నారు. భూసేకరణ కోసం ఆర్డినెన్స్ తేవడంలో తప్పులేదన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications