సీఎం జగన్-భారతి తో శిల్పా రెడ్డి సమావేశం- సమంత క్లోజ్ ఫ్రెండ్ : భేటీ వెనుక..!!
ప్రముఖ మోడల్...ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి ఏపీ సీఎం జగన్ దంపతులతో సమావేశమయ్యారు. శిల్పా రెడ్డి ప్రముఖ హీరోయిన్ సమంతకు క్లోజ్ ఫ్రెండ్. కొద్ది రోజుల క్రితం సమంత- శిల్పా రెడ్డి ఛార్ ధామ్ యాత్ర కు వెళ్లారు. తాను సీఎం జగన్ ను కలిసినట్లుగా శిల్పా రెడ్డి సోషల్ మీడియాలో ఫొటో పోస్టు చేసారు. సీఎం జగన్ - భారతితో కలిసి దిగిన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కామెంట్ రాశారు. అందులో.. ఇంత ఆతిథ్యం, ప్రేమ మరియు ఆప్యాయతతో నన్ను మీ ఇంటికి స్వాగతించినందుకు ధన్యవాదాలు భారతి, జగన్ గారూ... ఇలాంటి అందమైన జంటను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ.. పేర్కొన్నారు.

సీఎంతో శిల్పారెడ్డి సమావేశం
తాను ఎందుకు సీఎం దంపతనులకు కలిసిందీ మాత్రం అందులో వెల్లడించలేదు. దీని పైన సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అయితే, ఈ సమావేశం తన వ్యక్తిగతంగా అంశాల కోసం కలిసారా అంటూ చర్చ మొదలైంది. సమంత - నాగ చైతన్య విడాకుల వ్యవహారం పూర్తిగా వారి పర్సనల్ అంశమే అయినా.. మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఇక, వారి విడాకుల ప్రకటన తరువాత సైతం దీని పైన చర్చ సాగింది. కొద్ది రోజుల క్రితం అక్కినేని నాగార్జున సైతం సీఎం జగన్ తో సమావేశమయ్యారు.

వ్యక్తిగతమా.. భేటీ వెనుక
అయితే, అది పూర్తిగా వ్యక్తిగత సమావేశం అంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చారు. తాజాగా, నేషనల్ మీడియాతో మాట్లాడిన సమంత..తన అభిప్రాయాలను స్పష్టంగా షేర్ చేసుకున్నారు. విడాకుల కరాణంగా తాను ఒక దశలో చనిపోతానేమో అనే భయం ఏర్పడిందని..కానీ, ఆ తరువాత తాను ఆ ఫీలింగ్స్ నుంచి బయటకు వచి మరింత స్ట్రాంగ్ గా మారానని సమంత చెప్పుకొచ్చారు. తాను గతంలో సైకలాజికల్ గా బలహీనంగా ఉన్నానని ఫీలయ్యేదానిని చెప్పిన సమయంత..తనకు జరిగిన చేదు అనుభవాన్ని ఫేస్ చేసిన తరువాత తాను ఎంత బలవంతురాలో తనకే అర్దం అయిందంటూ వివరించారు.

ఇంకా తేలని టిక్కెట్ల ధరల వ్యవహారం
అసలు విడాకుల సమయంలో తన వ్యక్తిగత జీవితంతో పాటుగా.. తన ప్రొఫెషనల్ జీవితం సైతం కుప్పకూలిపోయాయనే అభిప్రాయం ఏర్పడిందని.. కానీ, ఇప్పుడు తాను చాలా ధైర్యంగా ఉన్నానని సమంత చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు శిల్పారెడ్డి తాడేపల్లిలో సీఎం జగన్ దంపతులను కలవటం ద్వారా..మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తి కర చర్చకు అవకాశం ఏర్పడింది. అయితే, తాజాగా టాలీవుడ్ నుంచి సినిమా టిక్కెట్ల ధరల పెంపు గురించి ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. ఈ సమయంలో ఈ సమావేశం జరగటంతో ఆ విధంగానూ చర్చ కొనసాగుతోంది.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications