పెద్దనోట్ల రద్దు: పని ఒత్తిడితో ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ మృతి
అవిశ్రాంతంగా విధులు నిర్వహిస్తూ పనిభారంతో ఒత్తిడికి గురై బ్యాంకు మేనేజర్ ఒకరు శనివారం సాయంత్రం మృతిచెందారు. నెల్లూరు మూలాపేట కోనేటిమిట్టకు చెందిన షేక్ షరీఫ్(43)ఎస్బీఐ బారకాస్ శాఖలో డిప్యూటీ మేనేజర్
నెల్లూరు: అవిశ్రాంతంగా విధులు నిర్వహిస్తూ పనిభారంతో ఒత్తిడికి గురై బ్యాంకు మేనేజర్ ఒకరు శనివారం సాయంత్రం మృతిచెందారు. నెల్లూరు మూలాపేట కోనేటిమిట్టకు చెందిన షేక్ షరీఫ్(43)ఎస్బీఐ బారకాస్ శాఖలో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ. 1000. రూ.500 నోట్లను రద్దు చేసినప్పటి నుంచి బ్యాంకులో పనిఒత్తిడి పెరిగింది.
ఈ నేపథ్యం లో శనివారం సాయంత్రం విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయన్ను హుటాహుటి న ఆస్పత్రికి తలించారు. కాగా, మార్గంమధ్యలో ఆయన మృతి చెందారు. బ్యాంకులో పనిభారం, ఒత్తిడి ఎక్కువగా ఉందని తనతో చెప్పాడని షరీఫ్ తండ్రి జహీర్ తెలిపారు.

పెద్ద నోట్లు ప్రాణం తీశాయి
కర్ణాటకలోని తుమకూరు జిల్లా చేళూరులోని స్టేట్బ్యాంక్ ఆఫ్ మైసూర్(ఎస్బీఎం)లో నోట్ల మార్పిడికి శనివారం వృద్ధులకు అవకాశం కల్పించారు. ఈ విషయం తెలుసుకున్న సూలయ్యనపాళ్య గ్రామానికి చెందిన రైతు సిద్ధప్ప(68) రూ.500 నోట్లతో బ్యాంకుకు వెళ్లి క్యూలో నిల్చున్నాడు.
గంటల తరబడి నిలబడటంతో అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేసరికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిద్ధప్పకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
ప్రాణం తీసిన చిల్లర
చిల్లర సమస్య కారణంగా సకాలంలో వైద్యసేవలు అందక ఓ వ్యక్తి ప్రాణాలో కోల్పోయిన విషాదకర ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజవొమ్మంగి మండలం కిండ్ర గ్రామానికి చెందిన తాపీమేస్త్రి జి కృష్ణ కొన్నాళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నాడు.
ఆదివారం సమస్య ఎక్కువ కావడంతో ఏలేశ్వరం ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడానికి బయలుదేరాడు. చిల్లర లేకపోవడంతో కొత్త రూ.2వేల నోటు పట్టుకుని ఉదయం నుంచి గ్రామంలో పలు దుకాణాలకు తిరగగా మధ్యాహ్నానికి చిల్లర లభించింది. ఇంతలో శ్వాస తీసుకోవడం కష్టమై గ్రామంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications