రూ.లక్ష పెట్టినోళ్లకు రూ.8 లక్షలు.. SBI స్కీమ్
అధిక ఆదాయం కోరుకునే వారికి పలు పెట్టుబడి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. వీటిల్లో దీర్ఘకాలం డబ్బులు పెట్టుబడిగా పెడితే అదిరిపోయే రాబడినిస్తాయని ఇన్వెస్ట్ మెంట్ నిపుణులు చెబుతున్నారు. గత పది సంవత్సరాల సమయంలో ఏ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అధిక రాబడినిచ్చాయో తెలుసుకుందాం.
కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్, కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్, మిరే అసెట్ ఎమర్జింగ్ బ్లూచిప్, యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్, కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ అనేవి స్థిరమైన పనితీరును కనపరుస్తున్నాయి. ఇవి 15 శాతం నుంచి 23 శాతం వరకు రాబడిని అందించాయి. వీటిల్లో ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ స్కీమ్ ముందంజలో ఉంది.

ఇది 5 సంవత్సరాల కాలంలో దాదాపు 20 శాతం రాబడినిచ్చింది. అలాగే 7 సంవత్సరాల కాలంలో 23 శాతం రిటర్న్స్ అందించింది. 10 సంవత్సరాల కాలంలో చూస్తే 22 శాతం మేర రాబడినిచ్చింది. ఈ మ్యూచువల్ ఫండ్లో 10 సంవత్సరాల క్రిందట రూ. లక్ష పెట్టుబడిగా పెడితే ఇప్పుడు రూ. 8 లక్షలు లభించేవి. ఇతర ఫండ్స్ కూడా మంచి ఆదాయాన్ని అందించాయి.
ఎస్బీఐ తర్వాత మీరే అసెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ స్కీమ్ మంచి రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ ఐదు సంవత్సరాల కాలంలో 19 శాతం రిటర్న్స్ అందించింది. 7 సంవత్సరాల కాలంలో 21 శాతం ఆదాయాన్నిచ్చింది. 10 సంవత్సరాల కాలంలో అయితే 22.2 శాతం రాబడినిచ్చింది. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 5 సంవత్సరాల వ్యవధిలో 18.3 శాతం, 7 సంవత్సరాల కాలంలో 21.8 శాతం,10 సంవత్సరాల కాలంలో 22.8 శాతం చొప్పున రాబడిని ఇచ్చింది.












Click it and Unblock the Notifications