ఏపీలో కొత్త కేసులు తగ్గాయి- డిశ్చార్జ్ లు పెరిగాయి- కారణం తెలిస్తే షాక్...
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం మొదలయ్యాక ప్రభుత్వం వేగంగా స్పందించి భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తోంది. దేశంలోనే అత్యధిక స్ధాయిలో కరోనా టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రంగా కూడా రికార్డుల్లోకెక్కింది. కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు రాకముందే కరోనా పరీక్షల్లో ముందున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భారీగా నిర్వహిస్తున్న కరోనా పరీక్షల కారణంగా ప్రతీ రోజూ దాదాపు 50 నుంచి 70 కేసుల మధ్యన కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా ఇవాళ ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో కొత్త కేసుల సంఖ్య కంటే రికవరీ అయి ఆస్పత్రుల నుంచి డిశ్చార్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వాస్తవంగా చూస్తే ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకోవాల్సిన అంశమే ఇది. కానీ దీని వెనుక కారణాలను గమనిస్తే మాత్రం పరిస్ధితిలో ఎక్కడో తేడా వచ్చిందని అర్ధమైంది.
రాష్ట్రంలో కరోనా కొత్త కేసుల సంఖ్య కంటే డిశ్చార్జ్ ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం చెప్పిన లెక్కల వెనుక అసలు వాస్తవాలను గమనిస్తే రెండు రోజులుగా విజయవాడతో పాటు పలుచోట్ల టెస్టులు నిర్వహించడం లేదని తెలిసింది. కరోనా హాట్ స్పాట్ ప్రాంతంగా ఉన్న విజయవాడ నగరంలో ఐదు రోజుల నుంచి అనుమానితుల నుంచి సేకరించిన రక్తం శాంపిల్స్ ను పరీక్షించడం లేదని తెలుస్తోంది. దీనికి కారణం కిట్ల కొరతే అని కృష్ణా జిల్లా వైద్యాధికారి రమేష్ తెలిపారు.

కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ ఎంతో ముందుంది. రాష్ట్రంలో దేశంగా ఎక్కడా లేనంతగా... ప్రతీ మిలియన్ జనాభాకూ 3091 పరీక్షలు నిర్వహిస్తోంది. తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం చూసినా గత 24 గంటల్లో 8388 టెస్టులు జరిగాయి. అయితే కొరియా నుంచి లక్ష కిట్లకు ఆర్డర్ చేసిన క్రమంలో అన్ని కిట్లు రాకపోవడమో.. వచ్చిన కిట్లన్నీ పరీక్షలకు వాడేయడమో జరిగింది. ఈ విషయంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోయినా సాధారణ స్ధాయిలో టెస్టుల నిర్వహణకు శాంపిల్స్ సేకరణ జరిగినా పరీక్షలు పూర్తి కాకపోవడం వల్ల కొత్త కేసుల సంఖ్య కంటే డిశ్చార్జ్ లు అధికంగా నమోదైనట్లు అర్ధమవుతోంది.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్












Click it and Unblock the Notifications