కీచకుడు: మహిళా టీచర్లను చూస్తే పిచ్చెక్కిపోతున్న హెడ్మాస్టర్
పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన హెడ్మాస్టర్ పక్కదారి పట్టాడు. మహిళ పీఈటీపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడి లైంగిక వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు శుక్రవారం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి బాధిత పీఈటీ టీచర్ మీడియాకు వివరించిన వివరాలిలా ఉన్నాయి.
కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చనుబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ పి.రఘురామ్ గడిచిన ఏడాదిన్నర కాలంగా తనను వేధిస్తున్నారని పీఈటీ లక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు గతంలో సహచరులైన పీఈటీలకు తెలపగా వారు మాట్లాడి ఇకపై జరగకుండా చూస్తామన్నారన్నారు.
అయితే మళ్లీ ఈ మధ్య కాలంలో చెప్పడానికి వీలుకాని రీతిలో అసభ్య పదజాలంతో ఆమెను హింసించడం మొదలు పెట్టాడన్నారు. తోటి ఉపాధ్యాయులతో మాట్లాడితే వివాహేతర సంబంధాలను సైతం అంటగడుతున్నారని, తన గదిలో కూర్చుని పని చేయాలని కోరుతున్నట్లు లక్ష్మి వాపోయారు.

దీంతో బాధితురాలు రఘురామ్ ప్రవర్తనపై ఈమేరకు శుక్రవారం నూజివీడులో డీవైఈవోకు ఫిర్యాదు చేశారు. పాఠశాల నుంచి విజయవాడకు వెళ్తుండగా విస్సన్నపేటలో ప్రధానోపాధ్యాయుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం చనుబండ పాఠశాలకు తీసుకొచ్చారు.
ఈ సందర్భంలో స్కూల్లో తనపై చేసిన వేధింపులను ప్రశ్నిస్తూ ఆయనపై చేయి చేసుకున్నారు. హెడ్మాస్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్ధులు ఆయన గదికి ఎదురుగా ధర్నాకు దిగారు. ఈ విషయంపై పలువురు విద్యార్ధినిలు మాట్లాడుతూ తమపై కూడా చాలాసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిపారు.
గతంలో జిల్లా విద్యాశాఖ అధికారికి, నూజివీడు ఉప విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసింది. వారు సదరు కీచక ప్రధాన ఉపాధ్యాయుడిని పిలిచి మందలించారు. అయినా అతడి తీరులో మార్పు లేదు. దీంతో బాధితురాలు శుక్రవారం నూజివీడు ఉప విద్యా శాఖ అధికారికి మరోమారు ఫిర్యాదు చేశారు. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications