ఏపీలో స్కూల్స్ సెప్టెంబర్ 5 నుండే .. అకడమిక్ క్యాలెండర్ లోమార్పు
ఏపీలో బడి గంట మోగే సమయం ఆసన్నమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఇంతకాలం మూతపడిన స్కూల్స్ తిరిగి తెరగడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏపీలో కేసులు పెరుగుతున్నా సరే , వాటి కట్టడి కోసం ప్రయత్నిస్తున్న సర్కార్ విద్యా సంవత్సరం నష్టం కాకుండా కరోనా విషయంలో జాగ్రత్తలు వహిస్తూ స్కూల్స్ నడపాలని భావిస్తుంది . వచ్చేనెల 5వ తేదీ నుండి పాఠశాలలు పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే అకడమిక్ క్యాలెండర్ ను సిద్ధం చేయాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Recommended Video
సెప్టెంబర్ 5 నుండి పాఠశాలలు నిర్వహించడానికి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అకడమిక్ క్యాలెండర్ ను సిద్ధం చేసింది. విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఉండటం కోసం పాఠ్యాంశాలను 30 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం దానికి తగ్గట్టుగా కసరత్తులు చేస్తోంది.

పాఠశాలలు తెరిచిన తర్వాత కూడా కరోనా నిబంధనలు పాటించాలని చెప్తున్నారు. ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి విద్యార్థులకు మొత్తం ఎనిమిది పీరియడ్స్ నిర్వహించనున్నారు. ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 వరకు ఇవి జరగనున్నట్లుగా తెలుస్తుంది.
ఈ కొత్త అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 2021 విద్యాసంవత్సరంలో 181 రోజులు మాత్రమే పని దినాలుగా ఉంటాయి. ఈసారి ఇప్పటివరకు విద్యా సంవత్సరం ప్రారంభం కాకపోవడంతో సెలవులు కూడా బాగా తగ్గించింది .దసరా పండుగకు ఐదు రోజులు మాత్రమే ఇవ్వాలని, సంక్రాంతికి ఆరు రోజులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. అక్టోబర్ 22 నుంచి 26 వరకు దసరాకు సెలవు దినములుగా నిర్ణయించగా, వచ్చే సంవత్సరం జనవరి 12 నుండి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవు దినాలుగా నిర్ణయం తీసుకుంది . ఇక క్రిస్మస్ కు డిసెంబర్ 24 నుండి 28 వరకు, అలాగే వచ్చే ఏడాది వేసవి సెలవులు 2021 ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకుగా నిర్ణయించారు.












Click it and Unblock the Notifications