టీ రగడ: ప్రత్యేక దేశం కోసం టిడిపి సీమాంధ్ర నేతలు

పార్లమెంటులో మైక్రోఫోన్ను, అద్దాలను పగులగొట్టి తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఆత్మహత్యకు యత్నించాడని భావిస్తున్న పారిశ్రామికవేత్త, పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆ డిమాండ్ పెడుతున్నారు. తమకు సొంత పార్లమెంటు ఇవ్వాలని, బంగ్లాదేశ్, పాకిస్తాన్ల మాదిరిగా తమకు ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.
ఆంధ్రులకు గౌరవం లేనప్పుడు తాము దేశంలో ఉండాలా, వద్దా అని ఆలోచించుకునే హక్కు తమకు ఉందని తెలుగుదేశం సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నూటక్కి వేణుగోపాల్ పేర చాలా రోజుల క్రితమే అటువంటి పోస్టర్లు కృష్ణా జిల్లాలోని నూజివీడులో వెలిశాయి.
తాము ఈ దేశంలో ఉన్నామా, లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయని, తాము ఈ దేశీయులం కామనే భావనకు గురవుతున్నామని తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. స్వయం పాలన కావాలని అడుగుతున్న తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తే తాము సీమాంధ్రను ప్రత్యేక దేశంగా చేయాలని ఎందుకు అడగకూడదని మరో తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడిగారు.
ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్లో తప్పు లేదని, ఐరోపా యూనియన్ మాదిరిగా భారతదేశం ఉండాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications