సంచలనం:త్వరలో పవన్కళ్యాణ్ టీవీ షో...కసరత్తు మొదలైంది!
Recommended Video
విజయవాడ:పవన్ కళ్యాణ్ అభిమానులకు, జన సేన కార్యకర్తలకు ఇది నిజంగా శుభవార్తే...తమ అభిమాన కథానాయకుడు, రాజకీయ నేత పవన్ కళ్యాణ్ త్వరలో ఒక టెలివిజన్ షో చేయనున్నారట.
అమీర్ఖాన్ 'సత్యమేవే జయతే' తరహాలో సామాజిక సమస్యలపై పవన్ కళ్యాణ్ ఈ టీవీ షో చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ కార్యక్రమ థీమ్, స్క్రిప్ట్ తతిదరాల కోసం పవన్ మీడియా టీం తీవ్రంగా కసరత్తు చేస్తోందట. ఈ షోను కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనూ ప్రసారం చేస్తారని సమాచారం.
వారంలో రెండు సార్లు అరగంట చొప్పున ఈ షో టెలికాస్ట్ కానుంది. ఎక్కువ మంది ప్రజలకు తన పార్టీ చేరువయ్యేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పవన్ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ షో ఏ టీవీలో ప్రసారం అవుతుందనే విషయాన్ని ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంచారు. అయితే ఇటీవలే పవన్ అభిమాని, రాజకీయ నేత తోట చంద్రశేఖర్ ఒక ఛానల్ కొనుగోలు చేయడంతో బహుశా ఈ షో ఆ టివి ఛానెల్ కోసమేనని భావిస్తున్నారు.