ఏపీలో ఇసుక తవ్వకాలపై నిషేధం-సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
ఏపీలో ఇసుక తవ్వకాల విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై గతంలో వచ్చిన ఫిర్యాదులను విచారించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ వీటిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వానికి ఊరట దక్కలేదు. ఎన్టీటీ ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిచిపోనున్నాయి.

ఏపీలోని చిత్తూరు జిల్లాలో 18 చోట్ల అక్రమ ఇసుక తవ్వకాలపై గతేడాది మార్చి 23న ఎన్జీటీ నిషేధం విధించింది. అలాగే మిగతా రీచ్ లలోనూ తవ్వకాల్ని పునస్సమీక్షించాలని ఆదేశించింది. దీన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం విచారణ జరిపింది. వాదోపవాదాలు విన్న తర్వాత ఎన్టీటీ తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఎన్జీటి తీర్పును సుప్రీంకోర్టు సమర్ధిస్తూ, దాన్ని యథాతధంగా అమలు చేయాలని ఆదేశించింది.
గతంలో ఏపీలో ఇసుక తవ్వకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఎన్టీటీ.. బి2 కేటగిరీ ఇసుక రీచ్లలో పాక్షికంగా యంత్రాలతో ఇసుక త్వవకానికి అనుమతి ఇవ్వడం చట్ట విరుద్దమని పేర్కొంది. బి1, బి2 కేటగిరీల కింద ఇసుక తవ్వకాల కోసం ఇప్పటికే ఇచ్చిన అన్ని రకాల పర్యావరణ అనుమతులను సమీక్షించాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ పర్యావరణ అనుమతులను తిరిగి పరిశీలించాలని అదేశించింది.
దీంతోపాటు రాష్ట్రంలో ఇసుక రీచ్ల పరిధిలో పర్యావరణ విధ్వంసం పరిశీలన, అంచనా కోసం ఎన్టీటీ నిపుణుల కమిటీని కూడా నియమించింది. ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని గుర్తించాలని కూడా ఆదేశించింది. రివర్ బెడ్లు, నదీ తీరాల్లో భారీ యంత్రాలతో మైనింగ్ చేసుకోవచ్చంటూ అనుమతివ్వడంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.18 కోట్ల జరిమానా కూడా విధించింది. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ జరిమానా చెల్లింపుపై స్టే ఇచ్చింది. కానీ ఇసుక తవ్వకాలు నిలిపేసింది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications