హోం మంత్రి వనిత నియోజకవర్గంలో టీడీపీ గెలుపు - కొత్త టెన్షన్..!!
వైసీపీ వర్సస్ టీడీపీ. ఇప్పుడు ఏ ఎన్నిక జరిగినా..రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. కొద్ది రోజుల క్రితం తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ బోర్డు ఎన్నికలలోనూ రెండు పార్టీల మద్దతు దారుల హంగామా కనిపించింది. అక్కడ జరిగిన ఎన్నికల తీరు పైన స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆ ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని పోలీసుల సాయంతో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఆ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేసారు.

హోం మంత్రి నియోజకవర్గంలో
ఇక, ఇప్పుడు హోం మంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు లో కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాలక మండలి ఎన్నికలు జరిగాయి. మొత్తం 11 స్థానాల్లో టీడీపీ మద్దతు దారులు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, మంత్రి సొంత నియోజకవర్గం కావటంతో ఇప్పుడు అక్కడ టీడీపీ ఏకపక్ష గెలుపు చర్చకు కారణమైంది. ఈ ఎన్నికల తీరు పైన కొందరు అధికారులకు ఫిర్యాదులు చేసారు. వైసీపీ నేతలు మాత్రం ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారంటూ జిల్లా సహకార అధికారికి ఫిర్యాదు చేసారు.

వైసీపీలో గ్రూపు రాజకీయాలతో
దీంతో..ఉన్నతాధికారులు ఈ ఎన్నిక జరిగిన తీరు గురించి వివరాలు సేకరిస్తున్నారు. 1983 నుంచి ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లోనూ ఈ బ్యాంకులో టీడీపీ తరపున పాలకవర్గం ఎన్నిక అవుతోంది. కానీ, ఇక్కడి వైసీపీ నేతలు కొందరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణమాల పైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీలో చోటు చేసుకుంటున్న గ్రూపు రాజకీయాలతో టీడీపీ లాభపడుతోందని వైసీపీ కౌన్సిలర్ బహిరంగంగానే ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్నా..వైసీపీ గ్రూపుల కారణంగా టీడీపీ బలపడుతోందని చెప్పుకొచ్చారు.

వైసీపీ హైకమాండ్ ఫోకస్
ఒక బ్యాంకు పాలక వర్గం ఎన్నికల్లోనే వైసీపీ నేతలు ఐక్యంగా పని చేయని సమయంలో.. నియోజకవర్గ ఎన్నికల్లో ఐక్యంగా ఉండగలరా అనే చర్చ నియోజకవర్గంలో మొదలైంది. ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాల పైన వైసీపీ అధినాయకత్వం సైతం ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏ ఎన్నిక అయినా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వైసీపీ..ఇలా టీడీపీ ఏకపక్షంగా అన్ని పదవులు దక్కించుకోవటంతో..దీని పైన చర్చ మొదలైంది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications