షాకింగ్ : ఏపీలో డేంజర్ బెల్స్.. తేల్చిన జలవనరుల శాఖ
దేశంలో కరువు విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏపీలో ఈ పరిస్థితి మరీ ప్రమాదకరంగా పరిణమించింది. రాష్ట్రంలోని నదులు, చెరువులు పూర్తిగా ఎండిపోవడంతో భూగర్భ జలాలపై కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. జలవనరుల శాఖ తేల్చి చెప్పిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సగటున 600 టీఎంసీలుగా ఉండాల్సిన భూగర్భ నీటి మట్టం ఇప్పుడు 100 టీఎంసీలకు పడిపోవడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
కరువుకు మారుపేరుగా చెప్పుకునే అనంతపురంలొ అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. జిల్లాలోని కొన్ని చోట్ల వెయ్యి అడుగుల దిగువన కూడా భూగర్భ నీరు లేకపోవడం దిగ్భ్రాంతిని కలిగించే అంశం. సగటున చూసుకుంటే జిల్లాలో భూగర్భ జలాలు 20 మీటర్ల దిగువనే లభ్యమవుతున్న పరిస్థితి. ప్రకాశం, పశ్చిమ గోదావరిలోను ఇదే పరిస్థితి ఉందంటే భూగర్భ జలాల తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ సంవత్సరం కూడా రుతుపవనాలు సకాలంలో రాకపోయినా..! సరైన వర్షపాతం నమోదు కాకపోయినా..! ఏపీ పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణాతో పాటు పెన్నా, నాగవళి, వంశధార, జంజావతి, తమ్మిలేరు, బుడమేరు, గుండ్లకమ్మ, స్వర్ణముఖి నదులు చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి. మరి ఈ ఏడైనా వరుణుడు కరుణించి కరువును దూరం చేస్తాడో.. లేదో.. వేచి చూడాలి.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications