శిల్పాను ఏం చేయలేరు, భయపడకండి, బాబు బాధపెట్టారు: శిల్పా కౌంటర్
శిల్పా సహకార సొసైటీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం చేసిన వ్యాఖ్యలపై వైసిపి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోమవారం ఉదయం కౌంటర్ ఇచ్చారు.
నంద్యాల: శిల్పా సహకార సొసైటీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం చేసిన వ్యాఖ్యలపై వైసిపి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోమవారం ఉదయం కౌంటర్ ఇచ్చారు.
వారి వద్దకు జగన్ తర్వాత బాబు: అఖిలకు షాక్, శిల్పా గెలుపుపై జోరుగా బెట్టింగ్లు
శిల్పా సహకార బ్యాంకుపై చంద్రబాబు ఆరోపణలు బాధాకరమని అన్నారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకు ఉందని తేల్చి చెప్పారు. శిల్పా సహకార సొసైటీ రిజిస్టర్ అయిందన్నారు.
ఎప్పుడైనా విచారణ చేసుకోండి
శిల్పా సహకార సొసైటీపై ఎప్పుడైనా విచారణ చేసుకోవచ్చునని శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. తాము ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. తాము ఎప్పుడూ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని చెప్పారు. ఈ రోజు వరకు తాము నిజాయితీగానే ఉన్నామని చెప్పారు.
Recommended Video
చంద్రబాబు దుష్ప్రచారం బాధించింది
తన కుటుంబంపై చంద్రబాబు చేసిన దుష్ప్రచారం బాధను కలిగించిందన్నారు. మానవ సేవే మాధవ సే అని నమ్మి రాజకీయాలు చేస్తున్నామని చెప్పారు. శిల్పా కుటుంబంపై ఎప్పుడూ అవినీతి ఆరోపణలు లేవని చెప్పారు. తమ కుటుంబంలో ఎవరు ఏ చిన్న తప్పు చేసినా విచారణ చేసుకోవచ్చునన్నారు.
ఇవీ టిడిపి అక్రమాలు
నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని శిల్పా మోహన్ రెడ్డి ఆరోపించారు. తమ కార్యకర్తలు, నేతల ఇళ్లపై అర్ధరాత్రి పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు పంచుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారన్నారు.
ఓటేయకుంటే.. చంద్రబాబు బెదిరింపు
ఓటు వేయకుంటే రేషన్, పింఛన్ కట్ చేస్తామని చంద్రబాబు బెదిరిస్తున్నారని శిల్పా మోహన్ రెడ్డి ఆరోపించారు. కోట్లలో టిడిపి నేతలు డబ్బులు వెదజల్లుతున్నారన్నారు. అధికార బలంతో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారన్నారు.
అన్ని వర్గాలకు బెదిరింపు
మూడేళ్లుగా తాను టిడిపిలో ఉన్నానని శిల్పా మోహన్ రెడ్డి చెప్పారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా చంద్రబాబు నంద్యాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు. నంద్యాల అభివృద్ధిపై సీఎంను ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదన్నారు. ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టిడిపికి ఓటు వేయాలని అన్ని వర్గాలకు బెదిరింపులు వెళ్తున్నాయన్నారు.
భయపడకండి.. శిల్పా హామీ
చంద్రబాబు బెదిరింపులకు నంద్యాల ప్రజలు భయపడవద్దని శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. మీకు పింఛన్లు, రేషన్కు సంబంధించిన వివరాలు మొత్తం ఆన్ లైన్లో ఉంటాయని, కాబట్టి అవి రాకుండా చేయలేరని ధైర్యం చెప్పారు. నంద్యాల ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా వైసిపి అండగా ఉంటుందన్నారు.
ఎన్ని కుట్రలు పన్నినా శిల్పా కుటుంబాన్ని ఏం చేయలేరు
టిడిపి నేతలు ఎన్ని కుట్రలు పన్నినా శిల్పా కుటుంబాన్ని ఏం చేయలేరని శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. మేం ఎప్పుడు కూడా ఏ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడలేదని చెప్పారు. తాను అనని మాటలను కూడా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఇదంతా నంద్యాల ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పేద కుటుంబంలో పుట్టి పదిమందికి సేవ చేయాలని ఆశించానన్నారు.