ఓటు వేయడానికి ఏపీకి వచ్చి.. సజీవ దహనం
Road accident: ఏపీలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరి పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరు మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా చీరాల నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ప్రైవేటు బస్సు చిలకలూరిపేట మండలం పసుమర్రు సమీపంలోని ఈవూరిపాలెం వద్ద ప్రమాదానికి గురైంది. పిడుగురాళ్ల- వాడరేవు బైపాస్ రోడ్డు పనుల కోసం కంకరను తీసుకొస్తోన్న టిప్పర్ను వేగంగా ఢీ కొట్టింది.

ఈ ఘటనలో టిప్పర్లో తొలుత మంటలు చెలరేగాయి. వెంటనే బస్సుకూ వ్యాపించాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అంజితో సహా అయిదుమంది సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. వారిని నీలాయపాలేనికి చెందిన ఉప్పుగుండూరు కాశీ, ఉప్పుగుండూరు లక్ష్మీ, ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ, చీరాలకు చెందిన బస్సు డ్రైవర్ అంజిగా గుర్తించారు.
బస్సులో ప్రయాణిస్తోన్న వారిలో 20 మందికి పైగా గాయపడ్డారు. బస్సు పూర్తిగా మంటలకు అహూతి అయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందించారు. వారికి ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది.
బస్సులో ఉన్న ప్రయాణికులందరూ చిన్నగంజాం, గోనసపూడి, నీలాయపాలేనికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి వాళ్లంతా హైదరాబాదు నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications