ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సాప్ట్వేర్ ఇంజనీర్
హైదరాబాద్: పెళ్లై మూడు నెలలు కూడా గడవక ముందే ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో జరిగింది. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రకాష్నగర్కు చెందిన రమేష్ కుమారుడు మురళీ విహర్ (29)కి తూర్పు గోదావరి జిల్లా అల్లవరం గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో ఇంటర్నెట్ ద్వారా పరిచయమైంది.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. విషయాన్ని మురళీ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పెళ్లికి నిరాకరించారు. దీంతో తల్లదండ్రులను ఎదిరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. హైటెక్ సిటీలోని ఓ ప్రముక సాప్ట్వేర్ కంపెనీలో మురళీ పని చేస్తున్నాడు.

భార్యతో కలిసి జీడిమెట్ల అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలైంది. కాగా, నెల రోజులుగా భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంటకు వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది.
దీంతో మనస్తాపానికి గురైన మురళీ బెడ్ రూంలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత భార్య బెడ్రూంలోకి వెళ్లి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications