ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సాప్ట్వేర్ ఇంజనీర్
హైదరాబాద్: పెళ్లై మూడు నెలలు కూడా గడవక ముందే ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో జరిగింది. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రకాష్నగర్కు చెందిన రమేష్ కుమారుడు మురళీ విహర్ (29)కి తూర్పు గోదావరి జిల్లా అల్లవరం గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో ఇంటర్నెట్ ద్వారా పరిచయమైంది.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. విషయాన్ని మురళీ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పెళ్లికి నిరాకరించారు. దీంతో తల్లదండ్రులను ఎదిరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. హైటెక్ సిటీలోని ఓ ప్రముక సాప్ట్వేర్ కంపెనీలో మురళీ పని చేస్తున్నాడు.

భార్యతో కలిసి జీడిమెట్ల అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలైంది. కాగా, నెల రోజులుగా భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంటకు వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది.
దీంతో మనస్తాపానికి గురైన మురళీ బెడ్ రూంలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత భార్య బెడ్రూంలోకి వెళ్లి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications