104 మందిని 420గా మార్చాడు: జగన్‌పై సోమిరెడ్డి

Somireddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. వైయస్ జగన్ 104 మందిని 420లుగా మార్చారని, అందుకు జగన్‌కు ఎంతో సమర్థ ఉండి ఉంటుందని, 420లుగా మారినవారిలో ఐఎఎస్ అధికారులు, ఇతర అధికారులు, మంత్రులు పారిశ్రామికవేత్తలు ఉన్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

కెసిఆర్ తన తన జీవిత కాలమంతా అందరినీ తిడుతూనే ఉంటారని ఆయన అన్నారు. తెలంగాణ బాగు కోసం కెసిఆర్ ఒక్క పనైనా చేశాడా అని ఆయన అడిగారు. తన రాజకీయాల వల్ల ఎంత మంది అనాథలయ్యారో కెసిఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోతే కెసిఆర్ కుటుంబ సభ్యులంతా చల్లగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రతి ఏడూ బహిరంగంగా ఆస్తులు ప్రకటిస్తున్న నేత దేశంలో తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక్కరేనని ఆయన చెప్పారు. జనవరి 3వ తేదీన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన ఆస్తులను ప్రకటిస్తానని చెప్పారని, బినామీలా ఆస్తులు కూడా ప్రకటిస్తారా అని ఆయన అన్నారు. ఎంత మంది బినామీల ఆస్తులు ప్రకటిస్తారో చూస్తామని ఆయన అన్నారు.

సొంత జిల్లా విజయనగరంలోనే బొత్సపై ప్రజలు తిరగబడ్డారని, బొత్స అక్రమ ఆస్తులపై ప్రజలు తిరగబడితే సైనికులను కాపలా పెట్టుకోవాల్సి వచ్చిందని సోమిరెడ్డి అన్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సోమిరెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+