వైసీపీ చేసింది 'జీరో'.. అదొక చేతకాని దద్దమ్మల పార్టీ: సోమిరెడ్డి
విజయవాడ: వైసీపీ ఒక చేతకాని దద్దమ్మల పార్టీ అని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ మండిపడ్డారు. దేశంలో వైసీపీ లాంటి ప్రతిపక్షాన్ని ఎక్కడా చూడలేదని మండిపడ్డారు.
అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడాన్ని సోమిరెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. నాలుగేళ్లుగా ప్రతిపక్ష పార్టీగా వైసీపీ పోషించిన పాత్ర 'జీరో' అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయం విషయమై తమ పార్టీ ఎంపీలతో 2016లోనే రాజీనామా చేయిస్తానని జగన్ అన్నారని, ఇప్పటికీ అవే మాటలు చెబుతున్నారని విమర్శించారు.
వైసీపీ ఎంపీలు నిజంగా రాజీనామాలు చేయదలుచుకుంటే.. వారికి ఎవరు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. కేంద్రంపై అవిశ్వాసం పెడుతామని జగన్ అంటున్నారని, అలా చేసినంత మాత్రాన బీజేపీ ప్రభుత్వం కూలుతుందా? అని ప్రశ్నించారు. సొంత పార్టీ ఎంపీలతోనే రాజీనామా చేయించలేని జగన్.. ఢిల్లీలోనూ చంద్రబాబును విమర్శించడం హాస్యాస్పదం అన్నారు.