ముందు దీనికి జవాబు చెప్పు: టీడీపికి వీర్రాజు దిమ్మతిరిగే ప్రశ్న, పవన్ కళ్యాణ్ కలిస్తేనే..
అమరావతి: తనపై టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న తదితరులు చేసిన విమర్శలపై బీజేపీ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. తనపై విమర్శలు చేసే వెంకన్న లాంటి వాళ్లు తనకు స్నేహితులేనని చెప్పారు. పవన్ కళ్యాణ్, టీడీపీ, బీజేపీ కలిస్తేనే చంద్రబాబు సీఎం అయ్యారని చెప్పారు.
తాను ఎవరికీ భయపడేది లేదని చెప్పారు. ఎవరో రాసిస్తేనే తెలుగుదేశం పార్టీ నేతలు తనపై విరుచుకుపడుతున్నారని చెప్పారు. తాను ఎవరి స్క్రిప్ట్ను చదవడం లేదన్నారు. అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు మంత్రి పదవులు ఇవ్వడంపై తొలుత టీడీపీ సమాధానం చెప్పాలని దిమ్మతిరిగే షాకిచ్చారు.

నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది బీజేపీ
తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది టీడీపీ కాదని, బీజేపీ అని వీర్రాజు చెప్పారు. జనసేన, టీడీపీ, బీజేపీ.. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తేనే ప్రభుత్వం ఏర్పాటయిందని చెప్పారు. వైసీపీ అధినేత జగన్తో నాకు, మా పార్టీకి (బీజేపీ) సంబంధం లేదని చెప్పారు.

గతి తప్పితే గట్టిగా సమాధానం చెబుతాం
గతి తప్పి మాట్లాడే వాళ్లకు ధీటుగా తాము కూడా సమాధానం చెప్పగలమని సోము వీర్రాజు అన్నారు. తాను క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చెబుతున్నానని అన్నారు. తనకు ఎలాంటి సొంత అజెండా లేదన్నారు. కార్యకర్తల అభిప్రాయాలే చెప్పానని తెలిపారు. తనకు టీడీపీతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.

వాస్తవాలు జీర్ణించుకోలేక నా ఇల్లు ముట్టడి
ఏ పార్టీ అయినా బహిరంగ సభలు పెట్టినప్పుడు విరాళాలు వసూలు చేయడం సహజమే అని సోము వీర్రాజు అన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా చేస్తుందని చెప్పారు. వసూలు, ఖర్చును రాష్ట్ర పార్టీకి జమ చేసే సంప్రదాయం కూడా తమకు ఉందని తెలిపారు. వాస్తవాలు చెబితే జీర్ణించుకోలేని వారు తన ఇల్లును ముట్టడిస్తున్నారని చెప్పారు.

మేం విడిపోతామని చెప్పలేదు, వాళ్లే నమస్కారం అన్నారు
తెలుగుదేశం పార్టీతో విడిపోతామని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు సోము వీర్రాజు. అవసరమైతే దండం పెట్టి వెళ్తామని అన్న వారే ఆ విషయం చెప్పాలని చంద్రబాబుకు, టీడీపీకి చురకలు అంటించారు. బడ్జెట్ ఒక రాష్ట్రానికి సంబంధించినది కాదన్నారు. ఈ బడ్జెట్ అద్భుతంగా ఉందన్నారు. ప్రత్యేక ప్యాకేజీపై కసరత్తు జరుగుతోందన్నారు. ఏపీ అభివృద్ధి బీజేపీ లక్ష్యమని చెప్పారు. కాగా, అంతకుముందు టీడీపీ నేతలు సోము వీర్రాజు ఇంటిని చుట్టుముట్టారు. దీనిపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications