వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
CM KCR: విశాఖలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ..! ఎప్పుడంటే..!
బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. దేశ రాజకీయాల్లో దూసుకెళ్లాలని భావిస్తోంది. ఆ దిశగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భవంత్ మాన్, కేరళ సీఎం పినరయ్ విజయన్ పాల్గొననున్నారు. ఎస్పీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా హాజరుకానున్నారు. ఈ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు.
ఇది ఇలా ఉండగా.. త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్ విశాఖలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించి తేదీలను కేసీఆర్ త్వరలో ఖరారు చేయనున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు నేతలో బీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఏపీలో కూడా బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
Comments
English summary
BRS has increased the speed. She hopes to enter the country's politics. In that direction, it has decided to go to the people. As part of this, a huge public meeting will be held on Wednesday.