సభకు రాని ఎమ్మెల్యేలకు ఇక.. స్పీకర్ సంచలన ప్రతిపాదన..!!
స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వరుస గా గైర్హాజరవుతున్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు సభకు రాకుండానే సంతకం చేసి జీతం తీసుకుంటున్నట్లు గుర్తించారు. తాజాగా అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ వీరి విషయంలో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. అదే విధంగా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాకపోవటం పైన గతంలోనూ స్పీకర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు స్పీకర్ ఇదే అంశం పైన స్పందిస్తూ సంచలన ప్రతిపాదన చేసారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సమాయత్తం అవుతున్న వేళ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేసారు. లక్నోలో జరుగుతున్న అఖిల భారత సభాపతుల సమావేశంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు'నో వర్క్.. నో పే' అనే విధానం చట్టసభల్లోనూ రావాలని సూచించారు. దానికి అనుగుణంగా చట్టం చేయాలని.. దానికి సభాపతుల సదస్సులో తీర్మానం చేయాలనీ ఆయన ప్రతిపాదించారు. ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే.. సంబంధిత అధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం సహా వారి వేతనాలు నిలిపి వేస్తున్నారని స్పీకర్ గుర్తు చేసారు. అయితే, తాము ఎన్నుకున్న ఎమ్మెల్యేలు సభకు రానప్పుడు ఎందుకు చర్యలు తీసుకోరని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అయ్యన్న చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల తర్వాత అసెంబ్లీకి ఒక్కరోజు కూడా రానివారు ఉన్నారని.. కనీసం సభలో జరిగే ప్రశ్నోత్తరాలు, చర్చల్లోనూ పాల్గొనడం లేదని ఏపీ స్పీకర్ పేర్కొన్నారు.

ఈ తరహా వైఖరి కారణంగా తమను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేస్తున్నారని స్పీకర్ పేర్కొన్నారు. సభకు హాజరు కాకపోవడం వలన ప్రజల దృష్టిలో సభ్యులు చులకనవుతున్నారని చెప్పుకొచ్చారు. సభకు హాజరు కాకుండానే వారు వేతనాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారంగా నో వర్క్.. నోపే విధానం పై చట్టం చేయాలని కోరారు. సభకు రానివారిని రీకాల్ చేసే హక్కు ప్రజలకు కల్పించేలా చట్టం చేయాలని ఏపీ స్పీకర్ ప్రతిపాదించారు. ఇటు వైసీపీ ఎమ్మెల్యేల్లో జగన్ మాత్రమే జీతం తీసుకోవటం లేదని.. కొందరు ఎమ్మెల్యేలు సభకు హాజరవుతున్నట్లు సంతకాలు చేసి.. సమావేశాలకు దూరంగా ఉంటున్నారని తాజాగా ఎథిక్స్ కమిటీలో చర్చ జరిగింది. ఆరుగురు ఎమ్మెల్యేలు ఇలా తీసుకున్నట్లు ప్రాధమికంగా గుర్తించారు. వీరి వివరాలు పూర్తి స్థాయిలో సేకరించిన తరువాత సభలో చర్చించి.. ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళ్లాలో డిసైడ్ చేయాలని నిర్ణయించారు. కాగా, ఇప్పుడు అయ్యన్న చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి.
-
తమిళనాడు, బెంగాల్ ఎన్నికల వేళ.. కీలక పరిణామం- బీజేపీకి బూస్ట్ -
226 స్థానాల్లో విజయం మాదే: మమతా బెనర్జీ సంచలనం -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..?












Click it and Unblock the Notifications